AP: తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. తొలుత క్షేత్రాధిపతి వరాహస్వామివారిని దర్శిచుకుని, ఆ తర్వాత శ్రీవారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతోపాటు ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.