ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రపంచ వేదికపై ఆమె అద్భుతమైన ప్రతిభతో దేశ కీర్తిని చాటారని ప్రశంసించారు. నిఖత్ మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిఖత్కు శుభాకాంక్షలు తెలిపారు.