పాకిస్తాన్లో జరుగుతున్న T20 ట్రై సిరీస్లో శ్రీలంకకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 162/8 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో 47 పరుగులు, బౌలింగ్లో 1 వికెట్ తీసిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ‘MOM’గా నిలిచాడు.