TG: సంగారెడ్డి జిల్లా IDA బొల్లారంలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. జిన్నారం మండలం బొల్లారం పాన్షాపులో విక్రయిస్తుండగా.. ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 138 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.