ADB: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను, సీట్ బెల్ట్ ధరించిన కారు డ్రైవర్లను ఆపి వారికి పువ్వులు అందజేసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.
NZB: ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడంతో ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీకి ఎంప్లాయిస్ జేఏసీ ఛైర్మన్ సుమన్ కుమార్ ధన్య వాదాలు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్తో పాటు నేతికుంట శేఖర్ పాల్గొన్నారు.
ATP: తిరుపతిలోని (ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో ఈనెల 4న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMM: ములుగులోని హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం గర్భాలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మార్చి 4న హైదరాబాద్లో జరగబోయే వారి గ్రాండ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు.
NLG: త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి చదును చేసి వదిలివేయడంతో రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
SRPT: విజయవాడలో జరిగిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. యండి షగుఫ్తకు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్, పలువురికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. గురువు దాసరి యల్లయ్య సన్మానింపబడ్డారు. బాల్ భవన్లో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
KMR: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సావిత్రి, యేచవ్వలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.
సత్యసాయి: అమరాపురంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తముడేపల్లి గ్రామ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రోళ్ల మండలం HT.హళ్లి గ్రామంలో నామకరణ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం’కార్యక్రమం & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సభ్యుడేగా చేసుకోవాలన్నారు.
కోనసీమ: అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు చూస్తున్నామని మండపేట రూరల్ CI దొరరాజు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాణాసంచా కేంద్రాల్లో భద్రత చర్యలు తీసుకావాలని ఆదేశించారు. అనుమతి లేని బాణాసంచా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం: ఎల్ఎన్ పేట మండలం మోదుగు వలస గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ 32వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రూ. 20వేల ఆర్థిక సహాయం అందించారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని వార్డుల్లో ఛైర్మన్ నాగేష్ శెట్కార్, సంబంధిత కౌన్సిలర్లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రతి వార్డులో రోడ్లు దుస్థితి, మురికి కాలువల సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ లోపాలను ఆయన పరిశీలించారు. వీటన్నింటికి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంయుక్త అధికారులకు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
BDK: సింగరేణి, ఇసుక రవాణా కారణంగా మణుగూరు – బయ్యారం రహదారిపై ధూళి (Dust) పెరిగి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నేడు ధ్వజమెత్తారు. ఇసుక లారీల అడ్డూఅదుపు లేని ప్రయాణాల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.