నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ నందమూరి బాలకృష్ణను కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు. బాలయ్య తన ఆశీస్సులు అందిస్తూ చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు. గతంలో వరలక్ష్మి, బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో నటించిన సంగతి తెలిసిందే.
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆత్మ చైర్మన్ కార్ల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కమిటీ సభ్యులకు ప్రమాణం చేయించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ రైతుల అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని, రైతుల సమస్యలపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సహకరించాలని సూచించారు.
BHNG: తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో మంచినీటి ప్లాంట్ను సర్పంచ్ పుట్ట సాయిలు ప్రారంభించారు. దాత గుర్రాల నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన దాతను ఈ సందర్భంగా అభినందించారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం సోలార్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం మార్కెట్ యార్డ్ మధ్య ఆక్రమిత భూములను స్వాధీనం చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 1,99,248 మంది రామయ్య సేవలో తరించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే నెలలో 1,97,860 మంది స్వామివారిని దర్శించుకోగా గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది అని అధికారులు తెలిపారు.
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవముత్తులను ఆసీనులను చేసి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NLG: మునుగోడులో రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించడం శుభపరిణామమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విద్యకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
WNP: వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జిల్లా సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
PLD: పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సున్నంబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో, అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో దుర్గం లావణ్య, అఖిలేశ్వర్, అన్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపుతప్పి కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షత్తగాత్రులను ఘటనా స్థలానికి చేరుకున్నారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు పోలీసులు జూద స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.6,060 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడుతుంటే వెంటనే 112 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.
GNTR: దాతల సహాయంతో తుళ్లూరు మండలం పెద పరిమి మరియు తాడికొండ మండలం రావెల గ్రామాల్లో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్స్ను కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం, దాతలు సూద్న్ గుంట రాఘవేంద్రప్రసాద్, కల్యాణికు సన్మానం చేశారు.
కృష్ణా: బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవి ఫేక్ వీడియోలైతే నిజమైన వీడియోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. మీపై వస్తున్న విమర్శలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. చేసిన తప్పులు బయటపడితే ఎదురుదాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
MBNR: హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకం సొంతింటి కల నెరవేర్చుతూ సామాజిక సమానత్వానికి దారి తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమి బాయ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8 భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లకు కూడా కొంత సహకారం లభిస్తుందని ప్రధాన క్యురేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని చెప్పాడు. మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వెల్లడించాడు.