• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన కలిశెట్టి

SKLM: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా మంగళవారం ఎచ్చెర్ల టీడీపీ నాయకులు విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రాష్ట్రపతి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు AP రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

December 10, 2024 / 07:06 PM IST

స్కూళ్లలో సదుపాయాలపై పిల్‌ దాఖలు.. విచారణ వాయిదా

TG: ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో సదుపాయాలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో ఆహార నాణ్యత లోపించిందని శ్రీగురు తేజ పిల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

December 10, 2024 / 07:04 PM IST

మానకొండూరులో రూ.100 కోట్లతో కొత్త పనులు

KNR: రోడ్లు, భవనాలశాఖ ద్వారా మానకొండూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో కొత్త పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులే కాకుండా కొత్త పనులకు నిధుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తి చేయించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఛాంబర్లో కలిశారు.

December 10, 2024 / 07:04 PM IST

హెల్మెట్ ధరించి ప్రయాణించడం సురక్షితం

ప్రకాశం: సైబర్ నేరాలపై మరియు హెల్మెట్ల వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు కంభం సీఐ కే.మల్లికార్జునరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. హెల్మెట్లు ధరించి ప్రయాణించడం సురక్షితమన్నారు.

December 10, 2024 / 07:03 PM IST

‘అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు’

MBNR: అమ్మాయిలను వేధించే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షి టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం మక్తల్ గురుకుల పాఠశాల, కలశాలలో విద్యార్థులకు షి టీమ్ పై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధిస్తే షీ టీం పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.

December 10, 2024 / 07:02 PM IST

‘తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

KDP: వర్షాలతో దెబ్బతిన్న రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని BJP రాష్ట్ర నాయకుడు మాదినేని రామసుబ్బయ్య, మండల అధ్యక్షులు గాడి భాస్కర్, సీనియర్ నాయకులు లేవాకు రామ్ మోహన్ రెడ్డిలు కోరారు. వర్షాలతో నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని మంగళవారం జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్‌కు BJP నాయకులు వినతి పత్రం అందజేశారు.

December 10, 2024 / 07:00 PM IST

మత్తుకు యువత దూరంగా ఉండాలి

VZM: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని 1వ పట్టణ ఎస్సై నరేష్ సూచించారు. పట్టణంలోని ఓ స్టడీ సర్కిల్‌లో యువతకు మంగళవారం అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేశామని వాటి ద్వారా తమకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

December 10, 2024 / 06:59 PM IST

ఆశాల ధర్నాపై మంత్రి దామోదర రియాక్షన్

TG: ఆశా వర్కర్ల ద్వారా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహా ఆరోపించారు. ఆశా వర్కర్ల ధర్నాపై ఆయన స్పందించారు. ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవాలను ప్రతిపక్షం తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆశావర్కర్లకు జీతాలు పెంచలేదని తెలిపారు. బీఆర్ఎస్ మాయలో పడి రోడ్లపైకి రావద్దని ఆశా వర్కర్లకు సూచించారు.

December 10, 2024 / 06:58 PM IST

గెలుపును నిలుపుకోవాలి: మంత్రి పొన్నం

SDTP: గెలిచిన క్రీడాకారులు ఆ గెలుపును నిలుపుకోవాలని, ఓడినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు మంత్రి పొన్నం సూచించారు. మంగళవారం హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:57 PM IST

తెలంగాణ తల్లిపై పాట రాస్తా: సుద్దాల అశోక్

TG: తెలంగాణ తల్లిపై త్వరలో పాట రాస్తానని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. జాతీయ అవార్డు కంటే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లిని చూస్తే వాళ్ల అమ్మని చూసినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ కూడా అడిగితేనే పెడుతుందని.. అడగకుండానే గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.

December 10, 2024 / 06:56 PM IST

యాడికిలో పర్యటించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

ATP: యాడికి మండల కేంద్రంలో జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. అరటి రైతుల సమస్యలు, ఇసుక సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాడికి కాలువకు త్వరలోనే నీటిని విడుదల చేస్తానన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ రుద్రమ నాయుడు, రంగయ్య, చరణ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:54 PM IST

‘విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

CTR: ఎంబీయూ వద్ద పాత్రికేయులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేసి గాయపరచడం దుర్మార్గపు చర్యగా అభిప్రాయపడ్డారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న వారిని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు.

December 10, 2024 / 06:53 PM IST

సీపీఎం పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక

KMM: ప్రభుత్వాలు మారిన ప్రజల బ్రతుకులు బాగుపడలేదని ప్రజా సమస్యల పరిష్కారంలో మార్పు రాలేదని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య అన్నారు. మంగళవారం రామాపురంలో జిల్లా కమిటీ సభ్యుడు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాలు సీపీఎం పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

December 10, 2024 / 06:52 PM IST

హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట

AP: హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ కోర్టులోని చెక్‌ బౌన్స్‌ కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఈ విచారణకు మంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

December 10, 2024 / 06:50 PM IST

వీరులపాడులో రెవెన్యూ సదస్సు

కృష్ణా: వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాహశీల్దార్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని భూములకు సంబంధించిన వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. భూ సమస్యలను రైతులు అర్జీ రూపంలో ఇచ్చారన్నారు.

December 10, 2024 / 06:50 PM IST