• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టర్ కార్యాలయం ముందు బ్రాహ్మణుల నిరసన

SRD: బ్రాహ్మణులను కించపరిచేలా పాట పాడిన జీడీ నరసయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. జీడి నరసయ్యపై వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

November 24, 2025 / 03:51 PM IST

‘ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్’

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వీకరించుకున్నారు. కలెక్టర్ వి.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

November 24, 2025 / 03:50 PM IST

305 కంపెనీలు మూసివేత

TG: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ చట్టాలు, నియమాల అమలును కట్టుదిట్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం నీటి కాలుష్య కారకాల పరిశ్రమలు 2193, వాయు కాలుష్య కారకాల పరిశ్రమలు 3164 ఉన్నాయని పీసీబీ గుర్తించింది. అందులో 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 305 కంపెనీలను మూసివేసింది. మరో 1,234 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది.

November 24, 2025 / 03:50 PM IST

పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేయండి: కవిత

WNP: కాంగ్రెస్ కక్షపూరిత వ్యవహారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం వనపర్తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.23 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం కోసం జీవో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవోను రద్దు చేసిందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

November 24, 2025 / 03:50 PM IST

‘ధర్మేంద్ర ఎంతో మంది హృదయాలను స్పృశించారు’

AP: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తన మరపురాని ప్రదర్శనలతో లక్షలాది మంది హృదయాలను స్పృశించారని అన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

November 24, 2025 / 03:48 PM IST

ఉమ్మడి జిల్లాలో మహిళా ఓట్ల కోసం కాంగ్రెస్ వ్యూహం!

NLG: అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంది. నల్గొండ జిల్లాలో 29,754 గ్రూపుల్లో,2,97,054 సభ్యులకు, సూర్యాపేట జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులకు చీరలు పంపిణీ చేశారు.

November 24, 2025 / 03:48 PM IST

ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి సంతాపం

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సంతాపం ప్రకటించారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరన లోటని కొనియాడారు. దశాబ్దాల తరబడి అద్వితీయ నటనతో ధర్మేంద్ర అలరించారని, యువ నటులకు ధర్మేంద్ర స్ఫూర్తిగా నిలుస్తారని గుర్తుచేశారు.

November 24, 2025 / 03:47 PM IST

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ నితిక పంత్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రేను జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ మరియు ఎస్పీ చర్చించారు.

November 24, 2025 / 03:46 PM IST

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ప్రస్థానం

➛ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.➛ 1960లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన 300లకు పైగా చిత్రాలలో నటించారు.➛ ‘షోలే’ చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.➛ 2004లో రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.➛  2012లో పద్మభూషణ్, 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డును అందుకున్నారు.

November 24, 2025 / 03:46 PM IST

కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు అందజేత

KMR: గాంధారికి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి విధి నిర్వహణలో భాగంగా గతేడాది కారు ఢీకొనడంతో మృతి చెందాడు. అతని మరణానంతరం ఆయన సతీమణికి కారుణ్య నియామకాల కింద ఎస్పీ రాజేష్ చంద్ర ఉద్యోగం కల్పించారు. అయితే, కానిస్టేబుల్ రవికి ఎస్​బీఐలో శాలరీ అకౌంట్ ఉండటంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి మంజూరైన రూ. కోటి బీమా చెక్కును SP సోమవారం అందచేశారు.

November 24, 2025 / 03:45 PM IST

చైనా ఎయిర్‌పోర్ట్‌లో భారత మహిళకు వేధింపులు

చైనా షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టులో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ చైనాదే అంటూ తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. నవంబర్ 21న పెమా వాంగ్ జోమ్‌థాంగ్ డోక్ అనే మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ట్రాన్సిట్ హాల్ట్ కోసం ఆ విమానం  చైనా నగరం షాంఘైలో దిగింది.

November 24, 2025 / 03:45 PM IST

ధర్మేంద్ర మృతి పట్ల రేవంత్ సంతాపం

TG: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీచరిత్రలో దిగ్గజ వ్యక్తి ధర్మేంద్ర మృతి తీవ్ర బాధాకరమని అన్నారు. విశిష్ట నటుడు ధర్మేంద్రను కోల్పోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

November 24, 2025 / 03:44 PM IST

‘ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వండి’

ప్రకాశం: ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చంద్రశేఖరపురం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ.. మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలతోపాటు, ఇల్లు నిర్మించాలని తహసీల్దార్ వాసుదేవరావుకు వినతిపత్రం అందజేశారు.

November 24, 2025 / 03:43 PM IST

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు కోటవీధి 21 వార్డులో ఈరోజు జరిగిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ‘[అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద 2 విడతల్లో 46.86 లక్షల రైతు కుటుంబాలకు రూ.6310 కోట్లు అందజేశామని ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ.14 వేలు ఇచ్చామని ‘సూపర్ సెక్స్’ హామీలలో ప్రతి హామీని అమల్లోకి తెచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

November 24, 2025 / 03:42 PM IST

రైతన్న ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు కోటవీధి 21 వార్డులో ఈరోజు జరిగిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ‘[అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద 2 విడతల్లో 46.86 లక్షల రైతు కుటుంబాలకు రూ.6310 కోట్లు అందజేశామని ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ.14 వేలు ఇచ్చామని ‘సూపర్ సెక్స్’ హామీలలో ప్రతి హామీని అమల్లోకి తెచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

November 24, 2025 / 03:42 PM IST