• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వేములవాడ డీఎస్పీగా శ్రీనివాసులు

SRCL: వేములవాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ సీపీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న ఆయనను వేములవాడ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సాయి రుత్విక్ ను ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.

March 1, 2026 / 09:30 AM IST

BJP జిల్లా అధికార ప్రతినిధిగా గురురాజారావు

KRNL: BJP జిల్లా అధికార ప్రతినిధిగా గురురాజారావును అధిష్ఠానం ఎన్నుకున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు.

March 1, 2026 / 09:29 AM IST

‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్‌కు టైం ఫిక్స్

కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కు టైం ఖరారైంది. మార్చి 2న మధ్యాహ్నం 12:59 గంటలకు పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యష్, కియారా అద్వానీలపై వచ్చే ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ 2026 మార్చి 19న విడుదలవుతుంది.

March 1, 2026 / 09:29 AM IST

పేలుడు ఘటన.. 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ లోవరాజు అనే వ్యక్తి మృతి చెందడంతో సంఖ్య 22కు చేరింది. మిగిలిన తొమ్మిది మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సామర్లకోట మార్చురీలో 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.

March 1, 2026 / 09:28 AM IST

విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు ఇవే..!

VSP: జిల్లాలోని 15 రైతు బజార్లలో ఆదివారం కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. టమాటా రూ.10, పూస వంకాయలు రూ.16, క్యాబేజీ రూ.14, ఉల్లిపాయలు రూ.18, క్యారెట్ రూ.22, దోసకాయలు రూ.24, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, అల్లం రూ.66, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని సూచించింది.

March 1, 2026 / 09:28 AM IST

విద్యార్థినులతో అసభ్యకర మాటలు.. టీచర్ పై ఫిర్యాదు

W.G: వీరవాసరం ZPH స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్ తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారంటూ 7వ తరగతి విద్యార్థినులు హెచ్.యం ప్రసాద్‌కు నిన్న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే వేణుగోపాల్ 10వ తరగతి విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పట్లోనే ఈ విషయం హెచ్.యంకు ఫిర్యాదు చేసినా ఆయనపై చర్యలు లేకపోవడం గమనార్హం.

March 1, 2026 / 09:28 AM IST

‘వనపర్తిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి’

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి అన్నారు. ఈ అంశంపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా పన్ను వసూళ్లు పూర్తిచేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.

March 1, 2026 / 09:26 AM IST

జిలుగుమిల్లి మండలంలో పోలీసుల తనిఖీలు

ELR: జీలుగుమిల్లి మండల పరిధిలో వజ్ర ప్రహర్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఉన్న పాతబడిన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, బస్ షెల్టర్లను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

March 1, 2026 / 09:25 AM IST

నేడు జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..!

నంద్యాల: జిల్లాలో ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000, స్కిన్లెస్ చికెన్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ చికెన్ రూ.195గా ఉన్నాయి. చేపలు కేజీ రూ.180, గుడ్లు డజను రూ.70గా విక్రయిస్తున్నారు.

March 1, 2026 / 09:25 AM IST

అక్రమంగా ఇసుక రవాణాలో కేసులో నిందితుడు అరెస్ట్

KNR: వీణవంక మండలం పరిధిలోని చల్లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివరాత్రి మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తూ కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి గాయపరిచి పరారయ్యాడు. గాలింపు అనంతరం అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.

March 1, 2026 / 09:23 AM IST

వీధి దీపాలు లేక భూమిరెడ్డిపల్లిలో ప్రజల ఇక్కట్లు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం భూమిరెడ్డిపల్లి పంచాయతీలోని జన్నావాలామిట్ట, వెంకటాపురం గ్రామాలలో వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు చీకటిగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 09:23 AM IST

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

KMM: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి  చెందాడు. చిన్న మండవ మున్నేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 09:22 AM IST

ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రశంసించిన సీఎం

VZM: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రావివలసలో ప్రజా వేదిక మీద మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మరడాన సత్యారావును అభినందించారు. ఈయన స్దానిక సింగారపు సంతోషి కుటుంబాన్ని P-4లో భాగంగా బంగారపు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. గత ఏడాది టెన్త్ విద్యార్థులకు విమానం ప్రయాణం, తదితర సేవా కార్యక్రమాలకు ఆయనను సీఎం అభినందించారు.

March 1, 2026 / 09:21 AM IST

సైకిల్ పై విధులకు హాజరైన కలెక్టర్

కృష్ణా: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా కలెక్టర్ బాలాజీ శనివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం సైకిల్‌పై తన నివాసం నుంచి కలెక్టరేట్‌కు వచ్చి విధులకు హాజరవుతున్నారు. వాహనాల వినియోగం తగ్గించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు.

March 1, 2026 / 09:20 AM IST

ఈనెల 3న మల్లూరు ఆలయం మూసివేత

MLG: మల్లూరులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని నిర్వాహకులు కోరారు.

March 1, 2026 / 09:19 AM IST