GNTR: పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. పంట పండించిన రైతు దగ్గర గిట్టుబాటు ధర వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరుదల లక్ష్మయ్య అనే రైతుకు ధాన్యం కొనుగోలు కూపన్ను అందజేశారు.