కృష్ణా: ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ముఖ్య వక్తగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను ఉద్దేశించి హ్యూమన్ రైట్స్ అంశంపై అవగాహన కల్పించారు.