NLR: జిల్లాలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఎంపీ వేమిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. టెండరింగ్ మొదలైన వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.