MLG: ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు రెసిడెన్షియల్ పద్ధతిలో స్క్రీనింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.