SKLM: మెరుగైన పరిశుభ్రత ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని DLPO గోపి బాల తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, స్వయం శక్తి మహిళా సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులకు మహిళా శక్తి సంఘాలు కూడా సహకారం అందించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త పట్ల అవగాహన పరచాలన్నారు.