• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నాకౌట్లలో భారత్-దక్షిణాఫ్రికా రికార్డు

నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్‌లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్‌‌లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్‌ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

February 22, 2026 / 09:30 AM IST

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..!

NZB: ఎడపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:29 AM IST

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఏమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో కొత్త మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన శుద్ధి నీటిని అందించే ప్రయత్నంలో ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్లాంట్ యజమాని నాగరాజు మోడలియార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:28 AM IST

గజ్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా, 20 మంది ప్రయాణికులకు గాయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:27 AM IST

రాష్ట్రస్థాయి పోటీలకు చిత్వాన్ ఎంపిక

SDPT: అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లికి చెందిన విద్యార్థి చిత్వాన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన చిత్వాన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో పీఈటీ వెంకట నర్సయ్య కృషి విశేషమని పేర్కొన్నారు.

February 22, 2026 / 09:25 AM IST

‘ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన ఉండాలి’

ASR: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన ఉండాలని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయభారతి అన్నారు. విజ్ఞానయాత్రలో భాగంగా స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాలు, న్యాయస్థానాన్ని శనివారం బీఏ విద్యార్థులకు చూపించారు. వివిధ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులు, ఉద్యోగులు, విధులు వివరాలను విద్యార్థులకు వివరించారు.

February 22, 2026 / 09:23 AM IST

రేపు డీఆర్డీఏలో ఉద్యోగ మేళా

TPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం కోటక్ మహీంద్ర మైక్రో ఫైనాన్స్ సంస్థలో ‘ట్రైనింగ్ సెంటర్ ఆఫీసర్’ భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివి వయసు 21-25 సంవత్సరాల వారు అర్హులన్నారు. సమాచారం కోసం 87124 95517లో సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 09:22 AM IST

నీటి సంపులో పడి తొమ్మిదేళ్ల బాలిక మృతి

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:22 AM IST

అటవీలో సాగుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

ASF: తీర్యాని మండల రిజర్వ్ అటవీలో చెట్లను నరికి సాగుకు ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. FRO శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మొర్రిగూడకు చెందిన ఆత్రం గంగు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 13 రోజుల రిమాండ్ విధించారన్నారు. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 22, 2026 / 09:20 AM IST

మంచిమాట: మీ శరీరానికి మీరిచ్చే కానుక అదే..

నడకను మీ శరీరానికి ప్రతిరోజూ మీరిచ్చే కానుకగా భావించండి. క్రమం తప్పకుండా రోజూ కనీసం 7 వేల అడుగులు నడవండి. నడకను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి తప్ప భారంగానో, చేయక తప్పని పనిగానో భావించకండి. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మనసు తేలికపడుతుంది.

February 22, 2026 / 09:20 AM IST

శ్రీవారి సేవలో మంత్రి అచ్చెన్న నాయుడు

SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం మంత్రి ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:19 AM IST

బడంపేట జాతరకు స్పెషల్ బస్సు సౌకర్యం

SRD: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి జాతరకు స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భక్తుల ప్రయాణ సౌకర్యార్థం బస్సును ప్రారంభించారు. ఈ స్పెషల్ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ అనుసరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.

February 22, 2026 / 09:18 AM IST

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం

KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయం ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

రైతులు ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ రైతోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతి గ్రామ క్లస్టర్‌ను ఎంచుకొని, ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

ఉద్యోగం రాక యువకుడి బలవన్మరణం

MNCL: ఉద్యోగం రావట్లేదని మనస్థాపం చెంది ఓ నిరుద్యోగి ఈ నెల 19న ఘటన చెన్నూర్‌లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటబొగూడకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి HYDలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్-2, 3, 4 పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తన తల్లికి భారం కాకూడదని వేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు.

February 22, 2026 / 09:15 AM IST