• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CRPF ఉద్యోగం సాధించిన యువకుడికి సన్మానం

ADB: బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ రాంనగర్ గ్రామంలో తగిరే ప్రదీప్ ఇటీవల విడుదలైన స్టాఫ్ సెలక్షన్ ఫలితాల్లో CRPF ఉద్యోగం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల తండ్రి కర్తర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సుందర్ సింగ్ యువజన సంఘాల నాయకులతో కలిసి ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందించారు.

February 22, 2026 / 07:24 AM IST

APTF రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ గా రెండోసారి నియామకం

VZM: ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF ) రాష్ట్ర అకడమిక్‌ కౌన్సిలర్‌గా బొబ్బిలికి చెందిన జె.సి.రాజు రెండవసారి ఎన్నికయ్యారు.ఈ మేరకు శనివారం ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ.. సంఘ నిర్మాణానికి, అభివృద్ధికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

February 22, 2026 / 07:23 AM IST

రాయచోటిలో పెరిగిన చికెన్ ధరలు

అన్నమయ్య: రంజాన్ మాసం సందర్భంగా రాయచోటిలో మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240కి చేరగా, మటన్ ధర కిలోకు రూ. 800గా కొనసాగుతోంది. చేపల ధరలు రూ. 100 నుంచి 300 మధ్య ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ భారీగా కనిపించింది. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ తగ్గలేదు. వ్యాపారులు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.

February 22, 2026 / 07:23 AM IST

20 ఏళ్ల తర్వాత దొరికిన సెల్‌ఫోన్

WGL: సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనబోతుల సదయ్య 2005లో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ తాజాగా లభించింది. అప్పట్లో చేసిన ఫిర్యాదు మేరకు ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఇటీవల ఫోన్‌లో సిమ్ వాడటానికి ప్రయత్నించగా అలర్ట్ రావడంతో పోలీసులు ట్రేస్ చేసి ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం బాధితుడికి అప్పగించారు.

February 22, 2026 / 07:22 AM IST

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

ప్రకాశం: జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా ఉండటం, కేంద్రాలలోకి వెళ్లడం నిషేధమని, అలాగే పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 07:22 AM IST

SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. లైవ్ బర్డ్ కిలో రూ.142 ఉండగా.. డ్రెస్స్‌డ్ విత్ స్కిన్ కేజీ రూ.206, స్కిన్ లెస్ కిలో రూ.234, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.142 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ మార్కెట్‌లో 12 గుడ్ల ధర రూ.72 ఉంది.

February 22, 2026 / 07:21 AM IST

జిల్లా ఆర్టీఐ కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా మణికుమార్

రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పెంపెట్ల మణికుమార్ను తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారం జిల్లా రెవెన్యూ అధికారి టీ. సీతారామ మూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెంపెట్ల మణికుమార్ ఎంపిక కావడం పట్ల పలు ప్రజా సంఘాల నేతలు, పలువురు సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.

February 22, 2026 / 07:20 AM IST

అయ్యగారిపల్లిలో దోమల మందు పిచికారి

MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్‌ను గ్రామ సర్పంచ్ మలిశెట్టి శోభన్ స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామ ప్రజలు దోమల వలన ఇబ్బందులు పడుతున్నారని, ఫాగింగ్ మిషన్ తెప్పించినట్లు తెలిపారు. ఈ మిషన్ పొగ రూపంలో ఔషధాన్ని పిచికారి చేసి దోమలను నశింపజేస్తుందని అన్నారు.

February 22, 2026 / 07:20 AM IST

విషాదం.. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

KRNL: గూడూరు పట్టణం పడమర బీసీ కాలనీలో శనివారం ఐదేళ్ల బోయ విజయలక్ష్మి ఆటలాడుతూ మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం గుంటూరులో ఉండగా, తాత–అవ్వల వద్ద ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లు కాలనీవాసులు చెప్తుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.

February 22, 2026 / 07:20 AM IST

ఎంఈవోగా జయప్రద నియామకం

KNR: చిగురుమామిడి మండల విద్యాశాఖాధికారిగా ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎంఈవోగా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

February 22, 2026 / 07:19 AM IST

‘YVU అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలి’

కడప YVU అభివృద్ధికి నిధులు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షులు D. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఆగిపోయిన పరిపాలన భవనం, హాస్పిటల్ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అలాగే, వర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు, అడ్మిషన్లు పెంచేందుకు ఉమ్మడి పీజీ సెట్‌ను రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 07:18 AM IST

‘నాణ్యమైన వస్తువులను కొనాలి’

ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలుచేయాలని ముంచంగిపుట్టు SI నాని ప్రజలకు సూచించారు. శనివారం ఆయన ముంచంగిపుట్టు వారపు సంతను సందర్శించారు. వారపు సంతల్లో కల్తీలేని, నాణ్యమైన సరుకులు విక్రయించాలని వ్యాపారులు, దుకాణాదారులకు సూచించారు. తూకాలు, కొలతలు సక్రమంగా ఉండాలన్నారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

February 22, 2026 / 07:15 AM IST

శ్రీసిటీని సందర్శించిన మాజీ డీజీపీ

TPT: మాజీ డీజీపీ డా. ఎం.మాలకొండయ్య శనివారం శ్రీసిటీని సందర్శించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ఇతర కార్యకలాపాలను వివరించగా.. విజన్, ప్రణాళిక, అమలు తీరును ప్రశంసించిన ఆయన దేశంలో ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ నిలుస్తుందని కొనియాడారు.

February 22, 2026 / 07:13 AM IST

నేడు మండలానికి తీన్మార్ మల్లన్న రాక

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో కుల్మోనాదుల దాడిలో రెండు నెలల చిన్నారి మరణించిన ఘటనపై టి.ఆర్.పి చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు కుమ్మెర వస్తున్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

February 22, 2026 / 07:12 AM IST

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవం సందర్భంగా తొలి పూజ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:12 AM IST