MDK: జిల్లాలో నార్సింగిలో విషాదం నెలకొంది. కారు ఢీకొన్న ఘటనలో భర్త ముందే భార్య మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన లక్ష్మి మూడవ రోజు కార్యక్రమం సందర్భంగా బంధువులు అందరూ స్నానం కోసం చెరువులోకి వెళ్లారు. స్నానానికి వెళ్లిన దుర్గయ్య(మృతురాలి మామయ్య) తిరిగి రాకపోవడంతో బంధువులు చెరువులో వెతకగా మృతదేహం దొరకడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.