HYD: సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా.. కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తేవాలని అన్నారు.