VSP: అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. భవిష్యత్తు లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కే.పవణ్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు. విశాఖపట్నంకు మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు ఎంతో కీలకమని అభివర్ణించారు.