CTR: రేపు గంగవరం మండలంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం సాయంత్రం తెలిపింది. ఈ సందర్భంగా మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9:30 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు.