SRD: నారాయణఖేడ్ డివిజాన్లో గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసులు ఒక్క పాదం మోపాలని ఎస్పీ రూపేష్ సూచించారు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బంది స్థానికంగా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. స్టేషన్కి వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు.