NZB: TU పరిధిలో ఎల్ఎల్బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు మిగతా వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించలని సూచించారు.
PLD: పల్నాడు కలెక్టరేట్లో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, మొక్కజొన్న రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అలాగే, కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
ఆదిలాబాద్: కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. డిజిటల్ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
AP: రాష్ట్రంలోని 17 వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్లో మార్చి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి సూచించారు. ప్రవేశ పరీక్షలు మే 8 నుంచి మే 11 వరకు జరుగుతాయని వెల్లడించారు.
కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MP బాలశౌరి, NTR జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు.
SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కుని ప్రథమస్థానంలో నిలిచారు.
GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 45,000 నగదుతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును కమలాపురం పీఎస్కు తరలించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.
AP: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం నలుగురు పోలీసులపై వేటు వేసింది. కేసులో నాటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీలు భీమరావు, మురళికృష్ణతో పాటు ఎస్ఐలు సతీష్ బాబు, మురళీకృష్ణపై సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భర్తకు ప్రియుడు ఉన్నాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఇద్దరూ కలిసి బెడ్రూమ్లో సన్నిహితంగా ఉండటం తాను చూసినట్లు తెలిపింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని తనను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.