• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మా టాప్‌ ఆర్డర్‌పై ఒత్తిడి: డేవిడ్ వార్నర్

తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్ల నుంచి గొప్ప ప్రదర్శనేమీ రాలేదని ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. వన్‌డౌన్, సెకండ్ డౌన్ బ్యాటర్లలో నిలకడ లేదని తెలిపాడు. ఇదే తమ జట్టును ఒత్తిడికి గురి చేస్తోందని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడి సెంచరీతో ఆదుకున్నాడని చెప్పాడు. అయితే, హెడ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు అవసరమని.. కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఆడిత...

December 11, 2024 / 09:09 PM IST

GOOD NEWS: రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడులు

AP: రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మకంగా సంస్థ రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గూగుల్ పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కృషి వల్లే ఇది ...

December 11, 2024 / 09:02 PM IST

EPFO ఖాతాదారులకు శుభవార్త

EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై EPFO చందాదారులు డైరెక్ట్ ఏటీఎంల ద్వారా తమ PF డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

December 11, 2024 / 08:59 PM IST

UPSCలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం అభినందనలు

TG: UPSCలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం ద్వారా ఆర్థిక సాయం అందిపుచ్చుకొని ఒకే దఫా 20 మంది పేద బిడ్డలు ఉత్తీర్ణత సాధించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. వీరితో పాటు విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.

December 11, 2024 / 08:55 PM IST

రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ పరిశీలించిన DMHO

WGL: రాయపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హనుమకొండ జిల్లా DMHO అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైపర్ టెన్షన్ 7,507 మంది, డయాబెటిస్ 3,560 మంది వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సలు అందిస్తున్నామని ఇంకా 2వ దఫాలో స్క్రినింగ్ చురుగ్గా కొనసాగించాలన్నారు.

December 11, 2024 / 08:50 PM IST

‘భారత్-చైనా సంబంధాల్లో నూతన అధ్యాయం’

గత అక్టోబరులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో సమావేశమైన విషయం తెలిసిందే. ఇరునేతల మధ్య విజయవంతంగా సాగిన ఈ సమావేశం.. రెండు దేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని సూచిస్తోందని సీపీసీ ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ లియూ జియాన్‌చావో వ్యాఖ్యానించారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాల బలోపేతానికి, రెండు దేశాల కుదిరిన ఏకాభిప్రాయాన్ని సంయుక్తంగా అమలు చేయడానికి చై...

December 11, 2024 / 08:50 PM IST

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ

SRCL: బోయినపల్లి మండలం కోదురుపాక, చౌరస్తా వద్ద ఆటోమేటిక్ సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ… ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలు, జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

December 11, 2024 / 08:50 PM IST

రేషన్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు: ఐజీ

SRPT: రేషన్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. గంజాయి, ఇసుక రవాణా కట్టడికి సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు.

December 11, 2024 / 08:48 PM IST

క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడుకోవాలి: ఏలియా

WGL: సంగెంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టుపల్లి ఏలియా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంగెం ఎంఈఓ రాము, శ్రీధర్, ముఖర్జీ, శ్రీనివాస్, రతన్ సింగ్ రాథోడ్, రవీందర్ తదితరులున్నారు.

December 11, 2024 / 08:48 PM IST

ధర్మపురి నరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,63,781 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ. 96,228, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.52,880, అన్నదానం రూ.14,673 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

December 11, 2024 / 08:48 PM IST

UPSC ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా

TG: UPSC-2024 మెయిన్స్‌లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఆగష్టు-26న ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేసింది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 135 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసింది. వీరిలో 20 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయినట్లు ప్రభుత్వం తెలిపింది.

December 11, 2024 / 08:45 PM IST

రేపటి ప్రజాదర్బర్‌లో వినతులు స్వీకరించనున్న ఛైర్మన్

ASR: పాడేరులో ఉన్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో రేపు ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నట్లు కిడారి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రజాదర్భర్‌లో ఉదయం 10 గంటల నుండి ప్రజల వినతులను జీసీసీ ఛైర్మన్ స్వయంగా స్వీకరీస్తారని తెలిపారు. కావున ప్రజలు ఈ ప్రజాదర్భర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

December 11, 2024 / 08:44 PM IST

ఓటర్ల జాబితాపై కోర్టుకు వెళ్తాం: కాంగ్రెస్

NLR: త్వరలో జరగనున్న నీటి సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. వాటిని సరిచేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మనుబోలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సమస్యలపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని విమర్శించారు.

December 11, 2024 / 08:43 PM IST

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

KMR: నాగిరెడ్డిపేట మండలంలో గ్రామాలు, తండాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, జప్తి జానకపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

December 11, 2024 / 08:42 PM IST

దేవత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య

కాళీ మాత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటలుగా పూజల్లో నిమగ్నమైన పూజారి దేవత ప్రత్యక్షం కాలేదన్న మనస్తాపంతో పూజారి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

December 11, 2024 / 08:42 PM IST