• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

త్రాగునీటి బోరుకు మరమ్మత్తులు

SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో సరాబులు వీధిలో త్రాగునీటి బోరు ఇటీవల మరమ్మతులకు గురైంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం మరమ్మత్తు పనులను చేపట్టారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవనాపు కుమార్, చిలక శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

December 11, 2024 / 07:07 PM IST

నీటి సంఘాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

ELR: ఈ నెల 14న జరగబోవు నీటి సంఘం ఎన్నికలకు ఉంగుటూరు మండలంలోని ఏడు మేజర్ నీటి సంఘాలకు ఎనిమిది మైనర్ నీటి సంఘాలకు నోటిఫికేషన్ జారీ చేశామని తాహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. నీటి తీరువా బకాయిలు వీఆర్‌వోకు పేమెంట్ చేసి పోటీ చేయు సమయంలో నామినేషన్ పత్రంతో పాటు నో Dues సర్టిఫికెట్‌తో పన్ను రసీదును జత చెయ్యాలన్నారు.

December 11, 2024 / 07:05 PM IST

BREAKING: విద్యార్థులకు అలర్ట్

AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు.

December 11, 2024 / 07:05 PM IST

‘ఇచ్చిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి’

SRCL: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్లలోని పెద్దూర్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా, ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రతను అలాగే స్టోర్ రూంలోని బియ్యం, కూరగాయలను వారు పరిశీలించారు.

December 11, 2024 / 07:04 PM IST

‘గుంతల మయమైన రోడ్లను పూర్తి చేశాం’

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ పలు వార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కౌన్సిలర్ మునిగడప పద్మ తెలిపారు. నెహ్రూ బస్తి నుంచి వన్నందాసు గడ్డకు వరకు సీసీ రోడ్డును ఎమ్మెల్యే మంజూరు చేశామన్నారు. ఈ పనులను బుధవారం పదోవార్డు కౌన్సిలర్ పరిశీలించారు.

December 11, 2024 / 07:02 PM IST

సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా గీతా జయంతి

VZM: శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గీతా జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీలు చేపట్టారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విష్ణు సహస్రనామ, భగవద్గీత పారాయణం సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మి పాల్గొన్నారు.

December 11, 2024 / 07:01 PM IST

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

PDPL: పాలకుర్తి మండలంలోని MPDO కార్యాలయం ఆవరణలో 34 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MRO చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. MLA సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు.

December 11, 2024 / 07:00 PM IST

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

TG: మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌, వినయ్ రెడ్డి మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

December 11, 2024 / 06:56 PM IST

GHMC కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

HYD: GHMC కమిషనర్ ఇలంబరితిని.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ పరిధిలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలైన్ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలన్నారు.

December 11, 2024 / 06:55 PM IST

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే

NGKL: కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. బుధవారం అచ్చంపేట ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు, ఇండ్లు కూల్చివేతలు కొనసాగించారన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్దే కనపడుతుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదన్నారు.

December 11, 2024 / 06:54 PM IST

పోలీస్ దాడులు…400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

KKD: పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బుధవారం గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో సారాయి తయారీకి నిల్వ ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. తయారీ దారులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

December 11, 2024 / 06:54 PM IST

బొగ్గు స్కామ్‌పై సీబీఐ కోర్టు కీలక తీర్పు

UPA హయాంలో బొగ్గు స్కాంపై సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురిని నిర్దోషులుగా రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. 341 పేజీల తీర్పు సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించింది. నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హరిశ్చంద్ర ప్రసాద్ గుప్తా, కేఎస్ చోప్రా, కేసీ సమారియాలను నిర్దోషులుగా ప్రకటించింది. సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు వెలువరించింది.

December 11, 2024 / 06:53 PM IST

స్కూల్ మూసివేతపై తల్లిదండ్రుల ఆగ్రహం

KNR: హుజురాబాద్ పట్టణంలోని విశ్వ ప్రగతి పాఠశాల భవనాన్ని ఖాళీ చేయించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. పాఠశాలను వేరే చోటికి మారిస్తే పిల్లలు చదువు దెబ్బతింటుందని ఈ సంవత్సరం ఈ పాఠశాలలోనే తరగతులు నిర్వహించాలని ఎంఈఓ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు.

December 11, 2024 / 06:52 PM IST

‘బ్లడ్ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోండి’

PLD: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి కోరారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన రక్తాన్ని అతి తక్కువ వ్యయంతో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 13న జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.

December 11, 2024 / 06:50 PM IST

రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయం: RDO

కోనసీమ: దీర్ఘకాలంగా వున్న రైతు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని రామచంద్రపురం RDO దేవరకొండ అఖిల పేర్కొన్నారు. పామర్రు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభకు ఆర్డీవో అఖిల హాజరయ్యారు. అఖిల మాట్లాడుతూ.. రీసర్వే గ్రామ సభల్లో వచ్చిన అర్జీలు, సీసీఆర్సీ కార్డులు అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

December 11, 2024 / 06:50 PM IST