ADB: యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం సైతం కలుగుతుందని ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రాథోడ్ ప్రీతల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయటం వలన జీవనశైలి మెరుగుపడటంతో పాటు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. యోగాను జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని సూచించారు.