WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో నేడు బాంబు స్క్వాడ్ సిబ్బంది జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తచర్యగా తనిఖీలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో తనిఖీలు చేపట్టారు.