KNR: నేడు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం-బి/ జువాలజీ /చరిత్ర పరీక్షకు బోర్డు అధికారులు సెట్ ‘ఏ’ పేపర్ ఎంపిక చేశారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 427, వొకేషనల్ విద్యార్థులు 252 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
GDWL: గద్వాల పట్టణంలోని ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్న ఒడిశా యువకుడు సూరజ్ బెహరా (22) గురువారం అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై కళ్యాణ్ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూరజ్ మృతిపై తోటి సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU)లో 70 ఏళ్లలోపు వయస్సున్న రిటైర్డ్ ఉద్యోగులతో 4 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక పద్ధతిన భర్తీ అయ్యే డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, అకాడమిక్ అడ్వైజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని KRU రిజిస్ట్రార్ తెలిపారు.
AKP: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం జోగంపేట కూడలిలో గుడ్డు వంటకాల విక్రయ కేంద్రాన్ని టీడీపీ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు ప్రారంభించారు. ప్రజలు ప్రతిరోజూ గుడ్డు తినేలా ప్రోత్సహించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీపీఎం జీవనోపాధి అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
అన్ని మ్యాచులను ఒకే మైదానం(దుబాయ్)లో ఆడటమే CT-2025లో భారత్కు కలిసొచ్చిందంటూ.. ఆ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నజిర్ హుసేన్, మైఖేల్ అథర్టన్ గతంలో తక్కువ చేసి మాట్లాడారు. దీనిపై తాజాగా దినేష్ కార్తీక్.. T20 WCలో లంక స్వదేశంలో, పాక్ దాదాపు అన్ని మ్యాచులూ కొలంబోలో ఆడిందని, మరి ఈ 2 జట్లు ఎందుకు సరైన ప్రదర్శన చేయలేకపోయాయని వారిని నిలదీశాడు.
BDK: మణుగూరు పట్టణం సాయి బాబా గుడి ఎదురుగా యథేచ్ఛగా అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమణలు సాగుతున్నాయి. ఆ సెంటర్ ప్రధాన రహదారిఫై నలువైపులా బడ్డీలు, కంటైనర్లు విస్తరించాయి. ఫుట్పాత్ రోడ్డును ఆక్రమణలు సాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు. సాయినగర్ బస్ స్టేజి వద్ద నిత్యం రద్దీగా ఉండే ఆ ఏరియాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.
JGL: తెలంగాణ రాష్ట్రంలోని పేదవారికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగం ప్రణీత దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య: రాయచోటిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా డైట్ కళాశాలలో విద్యార్థినులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మహిళా భద్రతపై పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ATP: విడపనకల్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు లేకపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించి మంత్రి పయ్యావుల సోదరుల సహకారంతో టీడీపీ నాయకులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ఏర్పాటుతో ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణులు, వైద్య సిబ్బందికి ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు.
TPT: నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ములాఖత్లో కలిశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. అరెస్టులతో ప్రజల కోసం పోరాడే నాయకులను భయపెట్టలేరని అన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.
BPT: రేపల్లెలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం వెనుక నిర్మించనున్న నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి టీడీపీ నేత అనగాని శివప్రసాద్ గురువారం భూమిపూజ చేశారు. ఈ మండపం నిర్మాణం పూర్తయితే, ఆర్యవైశ్యులకు శుభకార్యాలు, వివాహాలు జరుపుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
RR: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలబడి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత ఇంటి కల నిజం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో ఆక్రమణలకు గురైన రహదారిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే, మాంస విక్రయ దుకాణాలు విడిగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బైనేరు శివాలయం వద్ద ఉన్న వ్యర్ధాలను తొలగించి పట్టణ ప్రజలకు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని కోరారు.
సాధారణ నడక కంటే ఎనిమిది ఆకృతిలో నడవడం (సిద్ధ నడక) వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సరళరేఖపై రెండు వస్తువులను ఉంచి, వాటి చుట్టూ 8 అంకె ఆకారంలో నడవడమే ఈ పద్ధతి. ఇది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రత పెరగడానికి, ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది.