RR: శంషాబాద్ విమానాశ్రయానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆయన హాజరుకానున్నారు.