TG: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన వెలమ సంక్షేమ భవనం, కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలమ కులస్తుల చిరకాల వాంఛ నెరవేరిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ను స్మార్ట్ టౌన్గా మారుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.