TPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లాకు చెందిన సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం మరియు సమన్వయం కోసం ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం.