• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మునగాలలో వికలాంగుల వినూత్న నిరసన

SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోహిస్తూ వికలాంగులు బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడారు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు.

March 22, 2026 / 09:08 AM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 09:08 AM IST

‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్ డేట్ ఇదే

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

March 22, 2026 / 09:08 AM IST

పచ్చర్లలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు

GDWL: రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గ్రామ సర్పంచ్ బేబీ ఆధ్వర్యంలో ‘కిస్తీ’ వేడుకలను భక్తిశ్రద్ధతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించి కిస్తీ సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

March 22, 2026 / 09:06 AM IST

విజయవాడ ఆలయంలో ఇంటి దొంగలు

AP: విజయవాడ నగర శివారు యనమలకుదురు శివాలయంలో అధికారులే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. అర్చకుడు సాగర్ ఆలయానికి మారు తాళాలు చేయించి ఎవరూ లేనప్పుడు హుండీ  కానుకలను మాయం చేసేవాడని తేలింది. ఆలయ మంటపంలోని 16 CC కెమెరాలను ఆఫ్ చేసేవాడని, గత రెండేళ్లలో దాదాపు రూ.10 లక్షల విలువైన కానుకలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి ఆలయ ఈఓ భవాని సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.

March 22, 2026 / 09:05 AM IST

సంక ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్ మాతృమూర్తి వరలక్ష్మి అనారోగ్యంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చెందిన పలువురు నాయకులు, సభ్యులు ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

March 22, 2026 / 09:05 AM IST

దాడులు చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలోని గౌలిపేట కిందిగేరిలో ఇటీవల గాయపడిన బోయ రామును ఎమ్మెల్యే పార్థసారథి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నిరపరాధులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

March 22, 2026 / 09:04 AM IST

మల్లెబోయిన్పల్లిలో సీసీ రోడ్ల ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి గ్రామపంచాయతీలో ఎంపీ డీకే అరుణ కేటాయించిన నిధులతో సర్పంచ్ చికూరి శేఖర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ శేఖర్ శనివారం సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. బీజేపీ నేతలు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని ఎంపీ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి ముఖ్యమని వివరించారు.

March 22, 2026 / 09:04 AM IST

ఘనాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్

MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం పాలకవర్గ సభ్యులు, యువత హనుమాన్ ఆలయం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించి శుభ్రం చేశారు. గతంలో నిర్వహించి నిలిపివేయగా, మళ్లీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. హనుమాన్ ఆలయం వద్ద జరిగిన స్వచ్ఛ భారత్‌లో సర్పంచ్ వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, యువత పాల్గొన్నారు.

March 22, 2026 / 09:02 AM IST

గ్యాస్ నౌక ఆలస్యం.. కిరోసిన్ పంపిణీ

VSP: హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖకు ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 26న చేరనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ ద్వారా లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

March 22, 2026 / 09:00 AM IST

చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

GNTR: పొన్నూరు మండలం ములుకుదురులోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దాసరి సింగయ్య శనివారం విడుదల చేశారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

March 22, 2026 / 09:00 AM IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి : MLC

SKLM: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని PRTU కార్యాలయంలో ఉపాధ్యాయుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెమో 57 అమలు, పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరుతూ పలు తీర్మానాలు చేశారు.

March 22, 2026 / 09:00 AM IST

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

E.G: రాజమండ్రిలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చులు, కోళ్ల దాణా రేట్లు పెరగడంతో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.380, స్కిన్‌తో రూ. 360కు చేరింది. లైవ్ కోడి రూ.230కు విక్రయిస్తున్నారు. మరోవైపు మటన్ ధర కిలో రూ.1100కు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో మాంసం కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 09:00 AM IST

రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

VZM: మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని పాల్గొనే వారికి శేషవస్త్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.

March 22, 2026 / 09:00 AM IST

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఎక్కడ..?

HYD: నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉండటం లేదు. రద్దీ పరిస్థితుల్లో ప్రయాణికులు గాయపడటం, కొందరికి హార్ట్ ఎటాక్ రావడం, కింద పడిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండాలని, అన్ని బస్సుల్లో అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

March 22, 2026 / 08:58 AM IST