KMR: ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రిని కలిసినట్లు వివరించారు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 ఏళ్ల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే తెలిపారు.
SDPT: చేర్యాల మండలం ముస్త్యాల్లో బుధవారం BRS చేర్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మంగోలు చంటి, మేడిశెట్టి శ్రీధర్, ఎల్లారెడ్డి, ఆకుల రాజేష్ సీనియర్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
SDPT: మరమ్మతుల పేరుతో తొగుట మండలం కాన్గల్, తుక్కాపూర్ గ్రామాలకు సప్లై అయ్యే ట్రాన్స్ఫార్మర్లను తుక్కాపూర్ సబ్స్ స్టేషన్ నుంచి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని కాన్గల్, తుక్కాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతుల, నాయకుల ఆందోళనలతో ట్రాన్స్ ఫార్మర్ల తరలింపుకు వాహనాలను అధికారులు తిరిగి రోడ్డుపైకి పంపించారు.
KMM: కేంద్ర బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ రంగాలకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపులు చేయాలని కోరుతూ అభిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్యర్యంలో బుధవారం ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సంధర్బంగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు: ఘంటసాల మండలం చినకళ్లేపల్లిలో కాకతీయుల నాటి శిలాశాసనం బయటపడింది. చినకళ్లేపల్లికి చెందిన అంగత శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు. మల్లయపెద్ది తన ప్రభువు ద్వారా 25 గొర్రెలు ఒకరికి ఇచ్చారు. ఈ గొర్రెలు వారసత్వం స్వామివారికి నిత్యం నెయ్యి ఇవ్వాలని రాసి ఉన్నట్లు అనుభవజ్ఞులు చెబుతున్నారు.
E.G: పెరవలి మండలం కానూరులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉ.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరా బత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
E.G: రాజమండ్రి సిటీ ప్లానర్(CP) & డిప్యూటీ సిటీ ప్లానర్ (DCP) స్థానిక కోటగుమ్మం, ఏ.వి.ఏ రోడ్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపు చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి నుండి ఆక్రమణ తొలగింపు చర్యలు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.
SDPT: దూల్మిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పరి రాజేశ్వరికి అరుదైన వ్యాధి పాలిఆర్టికులర్ జువైనల్(ఎదుగుదల లోపించడం)తో బాధపడుతుంది. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.25 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి నేడు అందజేశారు.
మెదక్: తాండూర్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన నర్సింలు భార్య రాజేశ్వరి గర్భందాల్చింది. పురిటినొప్పులు రాగా కుటుంబీకులు మాతా, శిశు ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాన్పు చేశారు. మగ శిశువు పుట్టినా కాన్పులోనే చనిపోయాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆరోపించారు.
EG: ఉమ్మడి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం Xలో పోస్టు చేసింది. “పల్లె పండుగ” ద్వారా గుంతలు లేని ఆంధ్రప్రదేశే లక్ష్యంగా సీఎం, డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారని పేర్కొంది. ఉమ్మడి జిల్లా పరిధిలో గత 4 నెలల్లో 1,756 రోడ్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
TG: హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సితార హోటల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకోగా.. ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. మృతులు బీహార్కు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ATP: వజ్రకరూరు మండలం చాకిరేవు వద్ద బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చీరలు పూర్తిగా కాలిపోయాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 2 వేలకు పైగా చీరలు కాలిపోయాయని, రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
NZB: కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాలయువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశంఉంటుందని, శిక్షణలోపాల్గొనే ఆసక్తి ఉన్నవారు NYKలో సంప్రదించాలన్నారు.
MDK: విద్యుత్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఈ శంకర్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమల యజమానులు, రైతులు హాజరుకావాలని కోరారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అవసరాల కోసం సుమారు రూ.35.09 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు.