KDP: ఖాజీపేటలో ఆదివారం సాయంత్రం RSS ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వహకులు హరినాధ్ రెడ్డి తెలిపారు. మైదుకూరు రోడ్డులోని రెయిన్బో పాఠశాల నుంచి ర్యాలీ మొదలై టీచర్స్ కాలనీ, బీచావారిపల్లి సర్కిల్, అమ్మవారి శాల మీదుగా బస్టాండ్ కూడలి వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు.