భువనగిరి: జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న ‘ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ ఇండియా’ మహోత్సవ ఏర్పాట్లను బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ క్రీడా సంబరాలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.