BDK: పినపాక రైతు వేదికలో ఏడీఏ తాతారావు, ఏఓ వెంకటేశ్వర్లతో కలిసి మహిళా రైతులకు తైవాన్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందజేస్తోందని వారు తెలిపారు. ఆదివారం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయానికి ఆధునిక యంత్ర పరికరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.