KMR: మద్నూర్ మార్కెట్లో జొన్నల ధరలు మండుతున్నాయి. క్వింటాకు రూ. 6,000 ధర పలుకుతోందని రైతులు తెలిపారు. ప్రస్తుతం జొన్న పంట కల్లాలు కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలు కోసం జనాలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతులు పండించిన పంటను నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ధర పెరిగిందని కొనుగోలు దారులు చెబుతున్నారు.