WGL: నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.