MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని యెల్దుర్తి మండల మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జాతరను నిర్వహించారు.