KDP: మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలోని నూతన కోదండ రామ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు ఇవాళ తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మూడు రోజులపాటు పూజలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మ, మారెమ్మ, గంగమ్మ గ్రామ దేవతలతోపాటు కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజలు ఉంటాయన్నారు.