TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం హఠాత్తుగా సెలవులు ప్రకటించింది. ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతుండగానే అసాధారణ సెలవులు అంటూ ప్రకటన జారీ చేసింది. అయితే, అసాధారణ పరిస్థితులపై యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. వెంటనే హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.