GNTR: అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
TG: కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ‘కులగణన, OBC రిజర్వేషన్లు.. రాజ్యాంగ పరిరక్షణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసి.. బిల్లుపై గవర్నర్తో సంతకం చేయించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
బాపట్ల: నాటుసారా తయారీలో ఉపయోగించే నల్లబెల్లం విక్రయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు బెల్లం వ్యాపారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన తన ఆఫీస్లో బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెల్లం వ్యాపారులపై కూడా నిఘా ఉంటుందని సీఐ వారికి స్పష్టం చేశారు.
GNTR: తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో జాతీయ రహదారికి సమీపంలో వాహన దారులను ఇబ్బంది పెడుతున్న ఓ ట్రాంజెండర్కు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రాన్సజెండర్కు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ట్రాన్సజెండర్స్ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు.
BPT: వేసవి సెలవుల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరుగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ తుషార్ గురువారం సూచించారు. విహార యాత్రలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. పోలీసులకు సమాచారం అందిస్తే నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కోనసీమ: ఆస్తి పన్ను వసూళ్లులో మండపేట పురపాలక సంఘం కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో పదవ స్థానం సాధించిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి తెలిపారు. పన్ను వసూళ్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు చేసిన కృషిని అభినందించారు. గురువారం ఆమె ఛాంబర్లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వాలు నడవాలంటే పన్నులు వసూలు కీలకమన్నారు.
ELR: ఉంగుటూరు రూ.44 లక్షల 80 వేల నిధులతో సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్పంచ్లతో వేసవిలో తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు.
VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెడు వ్యసనాల, వాటి అనర్ధాలపై పట్టణ సీఐ ఎస్. షణ్ముఖరావు విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీతత్వంలో విద్యార్థులు కష్టపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.
NZB: జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్లో జనసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ పలు అంశాలపై సీపీతో చర్చించారు. అనంతరం పార్టీ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. సీపీను కలిసిన వారిలో పార్టీ కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు శ్రీను ఉన్నారు.
TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాలకు చెందిన 64 మంది రైతులు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయారు. వారికి పరిహారంగా 10.24 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
CTR: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.
NZB: సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సవిత్రీ బాయి ఫూలే దంపతులు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
SS: సోమందేపల్లి మండలం పోలేపల్లిలో వివాహిత లలిత(36)పై 10 మంది హత్యాయత్నం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. 10 మందిపై 307 సెక్షన్ కింద పెట్టామని, మహిళల పట్ల ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.
JGL: గొల్లపల్లి మండలం చిలువకోడూరు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ డీఎస్పీ ఉపేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము హాజరయ్యారు.