ATP: తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అధికారి DPM లక్ష్మణ్, జర్మనీ దేశస్థులు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల ప్రకృతి వ్యవసాయ పంటలను జర్మనీ దేశస్థులు వీక్షించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమితో పాటు మనిషి ఆరోగ్యం బాగుంటుందని వారికి రైతులు వివరించారు.
HYD: హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇవాళ ఉ.5:30 నిమిషాలకు బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారట. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ATP: తన పేరు చెప్పి కొంతమంది దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దందాలకు పాల్పడితే తనవారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులపై దౌర్జన్యాలకు దిగితే సహించే ప్రసక్తే లేదన్నారు.
BNR: తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య భువనగిరి జిల్లా కమిటీని నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షులు మహేష్,ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి సురేష్ నియమించారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వారికి ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.
HYD: హైదరాబాద్ పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి 382 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. టెన్త్ పాసై వయసు 18-24 సంవత్సరాలు ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆశక్తి గలవారు iocl.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన వేళ పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి ఆలిస్ వాజ్, భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర దంపతులు, ఢిల్లీ సీఎం అతిశీకి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరఫున నిలబడిన ఆల్కాలంబా, తదితరులు ఉన్నారు.
NZB: గాంధారి మాదిగ ఉప కులాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించడం హర్షనీయమని మాజీ టీఎన్జీవోస్ కార్యదర్శి సాయిలు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మాదిగ వారికి వర్గీకరణతో ఉప కులాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని తెలిపారు. మాదిగ ఉప కులాలకు కావాలసిన రిజర్వేషన్లు వచ్చాయని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేసిన పోరాటానికి ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
MDK: వివాహ శుభకార్యాలు, పుణ్య క్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13, 200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14, 700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
PDPL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనగర్తి గ్రామంలో ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏసీపీ గజ్జి కృష్ణ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై దీకొండ రమేష్, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు.
E.G: విద్యార్థినిపై అత్యాచారం కేసులో Jr. లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప: గత వైసీపీ హాయంలో తన నియోజకవర్గంలో భూ అక్రమాలపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కోరారు. కడప కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత రెడ్డి దృష్టికి పలు అంశాలను తీసుకుని వచ్చారు. అసైన్డ్ భూములను సైతం ఆక్రమించుకున్నారని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.
JGL: జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి, పునారావాస పథకంలో భాగంగా జీవనోపాధి పొందుటకు సబ్సిడీ ఋణాలు అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు లింకేజి లేకుండా దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.50,000 ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కావున అర్హులైన దివ్యాంగులు ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరికీ ఆమోదయోగమైన బడ్జెట్కు అందజేశారన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్ ఉన్నారు.