BHPL: గోరీకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఈర్ల రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భారత తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పల్లెబోయిన తిరుపతి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఈర్ల శ్యాము, యూత్ ఉపాధ్యక్షులు పసల రాకేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MDCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కుషాయిగూడ, నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహించారు. ACP వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాచకొండ CP ఆఫీస్ వరకు 2K రన్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ అథ్లెట్ నందిని అగసర, సింగర్ సాహితి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశఐక్యత, పటేల్ గొప్పతనాన్ని వివరించారు.
VIDEO: బిజ్జంపల్లిలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ.. ఉదయగిరి -బండగానిపల్లె ఘాట్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు కల్వర్టులపై బ్రిడ్జిలు నిర్మించాలన్నారు.
AKP: వరద బాధితులను ఆదుకోవాలని వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త బి.ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మునగపాక సమీపంలో ఆవ కాలువకు గండి కొట్టడంతో ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. బాధితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు.
NZB: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.
సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని, పటేల్ అభిప్రాయాలను నెహ్రూ గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగం పాక్ ఆక్రమించుకుందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం చూసిందని ప్రధాని పేర్కొన్నారు.
KMM: వైరా రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో 20.4 అడుగులకు చేరింది. ఆతర్వాత తగ్గుతూ ప్రస్తుతం 19.1 అడుగులకు చేరగా, సుమారు 7వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. దీంతో వైరా నది ఉధృతంగానే ప్రవహిస్తోంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2,569 జూనియర్ ఇంజినర్(JE) పోస్టులకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. వివరాలకు http://www.rrbapply.gov.in/#/auth/landingను సందర్శించాలి.
కామారెడ్డి పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు, చిన్న రాజుల నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఏక్త ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
MDK: చేగుంట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని 2k రన్ నిర్వహించారు. భారత ప్రభుత్వం 2014లో ఏక్తా దివస్ను ప్రారంభించిందని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకుంటామన్నారు. సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, సొసైటీ చెర్మన్ అయిత రఘు రాములు, ఏఎస్ఐ శ్రీనివాస్, చల్లా లక్ష్మణ్ పాల్గొన్నారు.
GDWL:సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గట్టులో ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక యూత్, విద్యార్థులచే శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. పటేల్ వంటి మహనీయుల వేడుకలను ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా దేశంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని చెప్పిన గొప్ప వ్యక్తి పటేల్ అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్ఐ కొనియాడారు.
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ప్రజల సమస్యలను విని, సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకునేలా ఆయన సూచనలు ఇచ్చారు.
SRD: భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పటాన్ చెరులో ఏక్తా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని చెప్పారు. సీఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.
AP: తిరుపతిలో ఇవాళ ఉదయం మరోసారి చిరుత హల్చల్ చేసింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం వారు భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరారైంది. దీంతో అక్కడున్న వారు టీటీడీ, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని చంద్రమౌళి ఆకాంక్షించారు.