• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

E.G: రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జీరో శాతం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమండ్రిలో ఎన్ హెచ్ అధికారులు, గామన్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మాట్లాడుతూ.. బ్రిడ్జి రోడ్డుపై ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని, గోతులు లేకుండా చూడాలని సూచించారు.

February 4, 2025 / 05:09 PM IST

‘శివారు ప్రాంతాల పట్ల అధికారులు శ్రద్ధ వహించాలి’

GNTR: శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. సచివాలయ కార్యదర్శులు ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాద్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కమిషనర్ నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన అర్జీ మేరకు సదరు కాలనీ, ప్రాంతాల్లో పర్యటించారు.

February 4, 2025 / 05:08 PM IST

చెత్తను సేకరించాలని కమిషనర్‌కు వినతి

ATP: గుంతకల్లులో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు గత పది రోజుల నుంచి ఇంటింటి నుంచి చెత్త సేకరించడం లేదన్నారు.

February 4, 2025 / 04:58 PM IST

గంజాయి అమ్ముతున్న జంట అరెస్ట్

HYD: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

February 4, 2025 / 04:47 PM IST

‘సమస్యను పట్టించుకొని సూపరింటెండెంట్ అవసరమా?’

ATP: రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం కార్మికుల సమస్య గోడు పట్టించుకోని సూపరింటెండెంట్ అవసరమా అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రస్తుత సూపరింటెండెంట్ వైఖరిని మల్లికార్జున తప్పు పట్టారు. అలాగే, సెక్యూరిటీ గార్డ్ రవిని తక్షణమే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 4, 2025 / 04:42 PM IST

అత్యాచారం నిందితులను శిక్షించాలని ధర్నా

ATP: గుంటూరులో వృద్ధురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, విజయ్ మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

February 4, 2025 / 04:27 PM IST

‘ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు’

ATP: గుంతకల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 90 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తిమ్మాపురం శివాలయానికి, నల్లదాసరపల్లి, చింతలంపల్లి, దోసలోడికి సుంకులమ్మ దేవాలయాలకు, పామిడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఓబులాపురం ఆంజనేయస్వామి దేవాలయాలకు ఈ నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

February 4, 2025 / 04:19 PM IST

ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరు: వైసీపీ ఎంపీ

AP: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో తెలిపారు. అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. పోలవరం కెపాసిటీ తగ్గించడం వల్ల 7 లక్షల ఎకరాలకు అందాల్సిన నీరు.. కేవలం 3.2 లక్షల ఎకరాలకే అందుతుందన్నారు. ఈ అన్యాయాన్ని ఆంధ్ర ప్రజలు క్షమించరని అన్నారు.

February 4, 2025 / 02:29 PM IST

రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా: ఆది శ్రీనివాస్

TG: రాష్ట్రంలో BRS పార్టీ BCల పేరుతో మరోసారి రాజకీయం చేయాలని చూస్తోందని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ MLA ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో సర్వేలు నిర్వహించి నివేదికలు బయటపెట్టని BRS ఇవాళ కులగణనపై మాట్లాడుతుందని మండిపడ్డారు. BRS చెప్పిన కులగణనలో 51 శాతం BCలు ఉంటే తమ కులగణనలో 56 శాతం BCలు ఉన్నారని తెలిపారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతామన్నారు.

February 4, 2025 / 02:25 PM IST

వైభవంగా సూర్య భగవానునికి క్షీరాభిషేకం

VZM: గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి ఆలయం పై వేంచేసి ఉన్న ఉష ఛాయ పద్మిని సమేత సూర్య నారాయణస్వామి వారికి విశేష క్షీరాభిషేకం జరిపారు. మంగళవారం రథసప్తమి పురస్కరించుకొని సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 4, 2025 / 02:14 PM IST

ఛలో హైదరాబాద్‌కు సామాజిక తెలంగాణ మహాసభ మద్దతు

SRPT: ఈనెల 7న హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టే లక్ష డప్పులు, వేల గొంతుల సభకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య తెలిపారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు.

February 4, 2025 / 01:51 PM IST

పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

SKLM: కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు వెల్లడించారు.

February 4, 2025 / 01:48 PM IST

‘విజయ గౌరీ నామినేషన్‌కి తరలి రండి’

SKLM: ఫిబ్రవరి 6న విజయ గౌరీ నామినేషన్‌కి తరలి రావాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని స్థానిక యుటిఎఫ్ భవన్‌లో అధ్యాపక, ఉపాధ్యాయులతో సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సంక్షేమానికి ఉద్యమ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ గెలుపు అవసరమని పేర్కొన్నారు.

February 4, 2025 / 01:44 PM IST

వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం నందు కొలువు దీరిన శ్రీ సద్గురు సుందర సాయిబాబా మందిరం 30వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

February 4, 2025 / 01:39 PM IST

బ్యాంకు వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన

NRML: కుబీర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు వినియోగదారులకు మంగళవారం స్థానిక ఎస్సై రవీందర్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిచయం లేని వ్యక్తులకు ఓటీపీ, ఫోన్ పాస్వర్డ్‌లు చెప్పొద్దని సూచించారు. ఆర్థిక నిరాలకు గురైతే వెంటనే బ్యాంకు, పోలీసులకు సంప్రదించాలని అన్నారు.

February 4, 2025 / 01:39 PM IST