AP: శ్రీశైల క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 30 రోజుల వ్యవధిలోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకలు లభించాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.7,19,58,064 నగదు లభించినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 122 గ్రా. బంగారం, 6 కిలోల 550 గ్రా. వెండిని భక్తులు సమర్పించారు. వీటితో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
BPT: పర్చూరు మండలం నూతలపాడులో గ్రామాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎస్సీ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్, స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతుతో గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్తీ టీ పొడి విక్రయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్లో నకిలీ టీ విస్తృతంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా హైవే డివైడర్ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు సమర్పించిన నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంబంధిత శాఖల అధికారులు, బ్యాంక్ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ ఈవో సూచించారు.
KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్ తెలిపారు. మొత్తం 5 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేనిచోట అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
అన్నమయ్య: రాయచోటి బైపాస్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
WGL: ఎంజీఎం ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగానికి రోజూ 500 నుంచి 700 వరకు కేసులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉండగా, 30 నుంచి 50 వరకు మేజర్ కేసులు, మిగతావి మైనర్ కేసులేనని పేర్కొన్నారు. పెరుగుతున్న రోగుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలో ట్రామా కేర్ విభాగాన్ని విస్తరించితే మరిన్ని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలిపారు.
సత్యసాయి: పెనుకొండలోని సీపీఐ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ కెమెరా సహాయంతో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
KNR: హుజురాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు వద్ద ఏఎస్సై కమల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, పోలీస్ సిబ్బంది మధు, మల్లయ్య, అంజలి, శ్రీధర్, అఖిల్, హోంగార్డు శ్రీను, రాజు పాల్గొన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లా పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1800 కోట్ల కేటాయించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెరుగుతుందంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది.
NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.