NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
E.G: జిల్లాలోని రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి, నమోదు వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని వెల్లడించారు.
విశాఖలో గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా RTC కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు నిఘా చేపట్టాయి. శనివారం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 2 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని తదుపరి చర్యలకై కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.
ELR: ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు, అదెప్పుడు ద్విచక్ర వాహనంలో అందుబాటులో ఉండాలని పెదపాడు ఎస్సై శ్రీను అన్నారు. పెదపాడులో శనివారం రాత్రి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రహదారి పైకి వచ్చే క్రమంలో అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఆదివారం రాజమండ్రికు చెందిన హనుమంశెట్టి దుర్గాప్రసాద్ దంపతులు రూ.70,001, వానపల్లికి చెందిన కర్రీ రామారెడ్డి దంపతులు రూ.25,116లు విరాళంగా ఆలయ డీసీ చక్రధరరావుకు అందజేశారు. ముందుగా వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
NZB: జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రెస్సెడ్ చికెన్ రూ.307, స్కిన్ లెస్ చికెన్ రూ.350 వరకు పలుకుతోంది. గత రెండు రోజులుగా చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
MDCL: అల్వాల్లో శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మశ్రీ గ్రహీత గరికపాటి నరసింహారావు దివ్య ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అల్వాల్ హరిదాస మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కళాపోషకులు మాచినేని జోగిరాజు దంపతులు పాల్గొన్నారు.
పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డుతోపాటు బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికెట్ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి జతచేయాలి. ప్రస్తుతం ఉన్న విధానంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ అని సీఎస్సీ స్పష్టం చేసింది.
HYD: మహిళల భద్రత కోసం షీ బాక్స్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మహిళలు మీ పని ప్రాంతంలో లైంగిక వేధింపులు జరిగినాయో..? వెంటనే ఫిర్యాదు చేయండి. మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం https://shebox.wcd.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే వారు దీనిని సేవ్ చేసుకోండి.
BHPL: మొగుళ్ళపల్లి మండలంలో బావిలో పూడిక తొలగించే క్రమంలో క్రేన్ పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను శనివారం రాత్రి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.
GDWL: ఐకేపీ వీవోఏల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నేతలు డ్యాం అంజి, తిమ్మప్ప శనివారం జిల్లా కేంద్రంలో పిలుపునిచ్చారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. నెలకు రూ.20 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దానిని నెరవేర్చలేదని విమర్శించారు. వీవోఏలు అందరూ తరలిరావాలని కోరారు.
దర్శకుడు ఆదిత్య ధర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ మాస్ ఇమేజ్కు తగినట్టుగా ఒక పవర్ఫుల్ దేశభక్తి నేపథ్య కథను ఆదిత్య సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అది బాక్సాఫీస్ వద్ద పాన్-ఇండియా స్థాయిని మించి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆదివారం కంబదూరు మండలంలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయ ప్రతి నిధులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఎర్రబండ గ్రామంలో వైసీపీ చేపట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో పాల్గొంటారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. రామయ్య కళ్యాణం వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చే క్రమంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. కళ్యాణ వేదిక భారీకేడ్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు.
పల్నాడు: వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదివారం వెల్దుర్తి మండల ప్రజలు ఒకరోజు ఐక్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్ 104 ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ప్రజలు ఎవరికి వారు వారి సొంత గృహంలోనే నిరాహార దీక్ష చేపట్టాలని వరికపూడిశెల జేఏసీ పిలుపునిచ్చింది.