• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

కృష్ణా: గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

February 4, 2025 / 08:33 AM IST

వైసీపీకి మాట్లాడే అర్హత లేదు: తేజస్విని

ATP: ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగా తేజస్విని అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజులను పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ‘ఫీజు పోరు’ అనే కార్యక్రమంతో కపటనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

February 4, 2025 / 04:14 AM IST

రేపు MALE నిరుద్యోగులకు జాబ్ మేళా

ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్‌లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.

February 4, 2025 / 04:03 AM IST

ఆప్ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఫిబ్రవరి 5న జరిగే పోలింగ్ పైనే ప్రధాన పార్టీలు బలమైన ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తమ పార్టీ గెలిచే స్థానాలను అంచనా వేశారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ‘ఆప్’ 55 స్థానాల వరకూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మహిళలు తమ భర్తలను ఒప్పించినట్లయితే 60 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు.

February 3, 2025 / 11:29 PM IST

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా: సోనూసూద్

AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం రాష్ట్రానికి అంబులెన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. నాలుగు అంబులెన్సులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు. సోనూసూద్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

February 3, 2025 / 08:25 PM IST

పోలీస్ గ్రీవెన్స్‌కు 54 ఫిర్యాదులు

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 54 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ దామోదర్ ఆదేశాల‌ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

February 3, 2025 / 08:20 PM IST

BREAKING: వైసీపీ కీలక ప్రకటన

AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని YCP మార్చి 12కు వాయిదా వేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటించింది. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.

February 3, 2025 / 08:17 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రజా గళాన్ని అణచివేసిందని మండిపడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి గండికొట్టిందని విమర్శించారు.

February 3, 2025 / 08:15 PM IST

మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

ASR: మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉద్రిక్త చేస్తామని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సరియ వలస గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులతో సోమవారం ఆందోళన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024లో నిర్మించిన బోరు అసంపూర్తిగా వదిలేసారని, దీంతో మంచినీరు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

February 3, 2025 / 08:08 PM IST

మాజీ ముఖ్యమంత్రి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

ప్రకాశం: చీరాల గడియారస్థంభం సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం మాజీమంత్రి పాలేటి రామారావు, మున్సిపల్ ఇంఛార్జ్ ఛైర్మన్ బోనిగల జైసన్ బాబుల ఆధ్వర్యంలో విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశం ఆమోదంతో శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.

February 3, 2025 / 07:59 PM IST

నులి పురుగుల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

జనగామ: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రమేష్, డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

February 3, 2025 / 07:36 PM IST

ఎస్సై కుటుంబానికి ఆర్థికసాయం

JGL: జిల్లాలో విధులు నిర్వర్తించి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన ఎస్ఐ రాజమౌళి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రూ.4 లక్షలు ఆర్థికసాయం సోమవారం అందించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఏపీ, టీజీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు కలిసి తోటి మిత్రుడు రాజమౌళి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారందరూ కలిసి రూ.4 లక్షలు పోగుచేసి అందించారు.

February 3, 2025 / 07:21 PM IST

క్రైస్తవ నమూనా ఏర్పాటు చేయాలని వినతి

KDP: కడప ప్రధాన కూడలిలో హిందూ, ముస్లిం మత నమూనాలు ఏర్పాటు చేసి, క్రైస్తవ నమూనా మరిచారని ఆ మతానికి చెందిన సభ్యులు ఎం. ప్రసాద్, సిహెచ్ విజయ్ బాబు అన్నారు. సోమవారం కడప కమిషనర్‌కు గ్రీవెన్స్‌లో అర్జీ ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

February 3, 2025 / 06:23 PM IST

సుబ్రమణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు

CTR: రామకుప్పంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.3.49 కోట్లు మంజూరు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఆనందరెడ్డి స్పష్టం చేశారు. ఆలయంతో పాటుగా అభిషేక మండపం నిర్మాణం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సుబ్రమణ్య స్వామి ఆలయ అభివృద్ధి చేస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 3, 2025 / 06:21 PM IST

తిరుమలలో ఈఓ ఆకస్మిక తనిఖీలు

TPT: TTD ఈవో జే. శ్యామల రావు సోమవారం అన్నదాన సత్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నం రుచిగా ఉందా అంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాన సత్రంలో స్వయంగా భోజనం చేసి రుచి చూశారు. నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

February 3, 2025 / 06:05 PM IST