• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కుక్కల దాడిలో15 గొర్రెలు మృతి

KDP: కాజీపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన మల్లయ్య జీవనోపాధిగా గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. తిప్పాయపల్లె నుంచి కమలాపురం మండలం ఎర్రవల్లి కొత్తపల్లికు గొర్రెలు మేపుకోవడానికి వెళ్లారు. కుక్కల దాడిలో మల్లయ్యకు చెందిన 15 గొర్రెలు మృతి చెందాయి. మరి కొన్నింటికి గాయాలు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దాదాపు లక్ష 50 వేల రూపాయలు నష్టం వాటిల్లింది.

October 30, 2025 / 10:15 AM IST

భారీ వర్షానికి కూలిన ఇల్లు

సిరిసిల్ల: కోనరావుపేట మండలంలో మొంథా తుఫాన్ కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రంలో తాళ్ల పెళ్లి జ్యోతికి చెందిన ఇల్లు గురువారం కూలిపోయింది. దీంతో నర్సవ్వ అనే మహిళలకు గాయమైనట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోని వీధులు బురుదమయమైనట్లు పేర్కొన్నారు.

October 30, 2025 / 10:15 AM IST

కొత్తకోట పంచాయతీలో విత్తన పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీ తాళ్లపల్లె గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల ప్రకారం గిద్దలూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెల్ల శనగ విత్తనాలు పంపిణీ చేశారు. 25 కేజీ‌ల పాకెట్‌లు పంపిణీ చేశారు. కొత్తకోట పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 300 ఎకరాల్లో శనగ పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు.

October 30, 2025 / 10:14 AM IST

‘యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది’

NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో, తాళ్ల రాంపూర్ గ్రామంలో యువతను డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం’లో భాగంగా రెండు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 టీంలు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమంలో సీపీ పి. సాయి చైతన్య పాల్గొని యువతకు దిశా నిర్దేశం చేశారు.

October 30, 2025 / 10:14 AM IST

పవన్ కళ్యాణ్ పర్యటనతో భారీ బందోబస్తు

కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ కోడూరులో ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు గురువారం భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సాఫీగా సాగేందుకు జిల్లా అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు. కోడూరు శివారు కృష్ణాపురం వద్ద బారికేడ్లు వేశారు. ఉదయం 10.30 గంటలకు సమయానికి ప‌వ‌న్ అక్క‌డికి చేరుకోనున్నారు.అనంతరం రైతులతో మ...

October 30, 2025 / 10:13 AM IST

తుపాన్ బాధితులకు నేడు నిత్యావసర సరుకులు పంపిణీ

GNTR: మొంథా తుపాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు పరామర్శించనున్నారు.ఉదయం 11 గంటలకు తెనాలి పరిధిలోని సీఎం కాలనీ 12 గంటలకు పెదరావూరు, సాయంత్రం3 గంటలకు కొల్లిపర మండలం తూములూరు గ్రామాల్లో మంత్రి పర్యటించి బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరకులు అందజేస్తారని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

October 30, 2025 / 10:11 AM IST

హెల్త్ ఆప్‌డేట్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్

సిడ్నీలో చికిత్స పొందుతున్న టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా హెల్త్ ఆప్‌డేట్ ఇచ్చారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, క్రమంగా కోలుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 

October 30, 2025 / 10:11 AM IST

ఆమిటిలో కూలిపోయిన పెంకిటిల్లు

VZM: మొంథా తుఫాన్ ప్రభావంతో తెర్లాం మండలం ఆమిటిలో పెంకితుల్లు గోడ కూలిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలాడంతో పైకప్పు కూడా కూలింది. కూలిన సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇల్లు కూలిపోవడంతో ఇంటి యాజమాని తిరుపతి రావు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

October 30, 2025 / 10:10 AM IST

టీడీపీ కార్యకర్త మృతి.. MLA నివాళి

TPT: ఏర్పేడు మండలం ఆమందూరు పంచాయతీ టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్య యాదవ్ ఆకస్మికంగా మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

October 30, 2025 / 10:08 AM IST

1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా..?

HYD: 1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌కు అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్ పూర్‌లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు.

October 30, 2025 / 10:08 AM IST

ఏడాదిలో 69 గంజాయి కేసులు: ASF ఎస్పీ

ASF: గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

October 30, 2025 / 10:07 AM IST

JOB ALERT: ఇవాళే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్/ ITI/ డిప్లొమాలో ఉత్తీర్ణులైన 28 ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/

October 30, 2025 / 10:07 AM IST

‘ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం’

సిరిసిల్ల: రైతులు అధైర్య పడవద్దు తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని ఫ్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలో తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నష్టపోయిన రైతుల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

October 30, 2025 / 10:06 AM IST

సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

VKB: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని SFA కాలేజీల బందుకు పిలుపునిచ్చింది. దీంతో దుద్యాల మండలంలో సీపీఎం జిల్లా నేత బుస్స చంద్రయ్యను పోలీసులు గురువారం ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

October 30, 2025 / 10:06 AM IST

సంగీతం, పాటలు, నృత్యాల ప్రక్రియే నాటకం

VKB: నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ అని ఛత్రా ఉపాధ్యాయులు సాయికిరణ్, నేహాల్ అన్నారు. HYDలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రగతి నగర్‌లో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్(M.P.A) విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలో భాగంగా శాఖాధిపతి పద్మప్రియ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు నాటక ప్రదర్శన చేయించారు.

October 30, 2025 / 10:05 AM IST