KMM: తల్లాడ మండల మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్కు బయలుదేరగా తల్లాడ మండల పరిధిలో ఉన్న సర్పంచులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం మండల కార్యదర్శి అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసి 13 నెలలు అయినా నేటికి బిల్లులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు.
AP: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. అన్యమతానికి చెందిన వ్యాఖ్యలతో కూడిన ఓ కారు తిరుమలలో ప్రత్యక్షం కావటం వివాదాస్పదంగా మారింది. అన్యమత వ్యాఖ్యలతో కూడిన వాహనాన్ని కొండ మీదకు ఎలా పంపించారంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
SRPT: BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది.
BDK: ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని పినపాక పీహెచ్సి వైద్యురాలు దుర్గ భవాని అన్నారు. బుధవారం ఆమె పోతిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, టీకా వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం ప్రతినెల వైద్య సిబ్బంది బాలింతలను గుర్తించి టీకా వేసే విధంగా కృషి చేయాలని అన్నారు.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్తో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘L2 ఎంపురాన్’. ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అయితే రిలీజ్కు ముందే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అరుదైన రికార్డును నెలకొల్పింది. 6 దేశాలు, 25 పట్టణాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
KMR: ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రిని కలిసినట్లు వివరించారు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 ఏళ్ల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే తెలిపారు.
SDPT: చేర్యాల మండలం ముస్త్యాల్లో బుధవారం BRS చేర్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మంగోలు చంటి, మేడిశెట్టి శ్రీధర్, ఎల్లారెడ్డి, ఆకుల రాజేష్ సీనియర్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
SDPT: మరమ్మతుల పేరుతో తొగుట మండలం కాన్గల్, తుక్కాపూర్ గ్రామాలకు సప్లై అయ్యే ట్రాన్స్ఫార్మర్లను తుక్కాపూర్ సబ్స్ స్టేషన్ నుంచి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని కాన్గల్, తుక్కాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతుల, నాయకుల ఆందోళనలతో ట్రాన్స్ ఫార్మర్ల తరలింపుకు వాహనాలను అధికారులు తిరిగి రోడ్డుపైకి పంపించారు.
KMM: కేంద్ర బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ రంగాలకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపులు చేయాలని కోరుతూ అభిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్యర్యంలో బుధవారం ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సంధర్బంగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు: ఘంటసాల మండలం చినకళ్లేపల్లిలో కాకతీయుల నాటి శిలాశాసనం బయటపడింది. చినకళ్లేపల్లికి చెందిన అంగత శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు. మల్లయపెద్ది తన ప్రభువు ద్వారా 25 గొర్రెలు ఒకరికి ఇచ్చారు. ఈ గొర్రెలు వారసత్వం స్వామివారికి నిత్యం నెయ్యి ఇవ్వాలని రాసి ఉన్నట్లు అనుభవజ్ఞులు చెబుతున్నారు.
E.G: పెరవలి మండలం కానూరులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉ.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరా బత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
E.G: రాజమండ్రి సిటీ ప్లానర్(CP) & డిప్యూటీ సిటీ ప్లానర్ (DCP) స్థానిక కోటగుమ్మం, ఏ.వి.ఏ రోడ్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపు చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి నుండి ఆక్రమణ తొలగింపు చర్యలు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.
SDPT: దూల్మిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పరి రాజేశ్వరికి అరుదైన వ్యాధి పాలిఆర్టికులర్ జువైనల్(ఎదుగుదల లోపించడం)తో బాధపడుతుంది. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.25 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి నేడు అందజేశారు.
మెదక్: తాండూర్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన నర్సింలు భార్య రాజేశ్వరి గర్భందాల్చింది. పురిటినొప్పులు రాగా కుటుంబీకులు మాతా, శిశు ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాన్పు చేశారు. మగ శిశువు పుట్టినా కాన్పులోనే చనిపోయాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆరోపించారు.