• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈ నెల 31న చీమకుర్తి తిరునాళ్లు

ప్రకాశం: చీమకుర్తిలో ఈ నెల 31వ తేదీన తిరుణాళ్లు నిర్వహించనున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు. సాయంత్రం సమయాల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తిరుణాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

March 22, 2026 / 08:10 AM IST

కాకినాడ పోర్డు గోదాముల్లో జేసీ తనిఖీలు

KKD: పోర్ట్ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీవో, పౌరసరఫరాల అధికారులు, పోలీసులతో కలిసి 29 గోదాములు, చెక్ పోస్టులను పరిశీలించారు. బియ్యం స్టాక్, రవాణా రికార్డులు, రిజిస్టర్లను సవివరంగా పరిశీలించి అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. 

March 22, 2026 / 08:10 AM IST

నేడు భువనగిరిలో మహేష్ గౌడ్ పర్యటన

TG: భువనగిరి, సిద్దిపేటలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భువనగిరి డీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సిద్ధిపేట జిల్లా నర్మెట్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ కూడా హాజరుకానున్నారు.

March 22, 2026 / 08:10 AM IST

నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ రాక

భువనగిరి: నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్న పేట మల్లేశం తెలిపారు. జనవరిలో నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడలో గెలిచిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యఅతిథిగా బహుమతులు ప్రధానం చేస్తారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మంత్రి బీఎల్ వర్మ వస్తున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 08:09 AM IST

నేడు జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే

KRNL: ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.310, స్కిన్‌లెస్ రూ.340 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-20 వరకు పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కోళ్లు ధరలు పెరగడంతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్తులు అన్నారు.

March 22, 2026 / 08:08 AM IST

బైరంపల్లిలో ఇంట్లో దొంగతనం ఘటన

MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లిలో మల్లేశ్ కుటుంబం ఊరెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దాడి చేశారు. దుండగులు బీరువా పగలగొట్టి అరతులం బంగారం, 15 తులాల వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై భయానికి లోనయ్యారు.

March 22, 2026 / 08:06 AM IST

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

KDP: ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300, స్కిన్‌లెస్ చికెన్ రూ.342, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.

March 22, 2026 / 08:04 AM IST

IPL: ఇషాన్ ‘సారథ్యం’ ఇక్కడా పనిచేస్తుందా?

కమిన్స్ వచ్చేవరకు IPL 2026లో SRHను ఇషాన్ నడిపించనున్న సంగతి తెలిసిందే. సారథిగా అతనికి మంచి రికార్డే ఉంది. కెప్టెన్‌గా 29 మ్యాచుల్లో 24 విజయాలు అందుకున్నాడు. SMAT 2025లో 11 మ్యాచులకు ఒక్కటే ఓడాడు. జట్టు భారం తనపై ఉన్నా బ్యాట్‌తో ఎక్కడా తగ్గకుండా 43.12 సగటుతో 7 సెంచరీలు చేశాడు. మరి అతని కెప్టెన్సీ స్టైల్ SRHకు పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

March 22, 2026 / 08:03 AM IST

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం: నరేష్ జాదవ్

ADB: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం దక్కుతుందని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం మండల అధ్యక్షులతో శనివారం సమావేశమై మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకాలలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 08:02 AM IST

రేపు ‘మీ ఇంటికి-మీ డాక్టర్’ సేవలు ప్రారంభం

W.G: కలెక్టర్ నాగరాణి చొరవతో జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి-మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. రేపు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు.

March 22, 2026 / 08:02 AM IST

మహిళల కోసం పింక్ టాయిలెట్

శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్ల ను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

March 22, 2026 / 08:00 AM IST

రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ దంపతులు

ATP: రాయదుర్గం సిద్ధప్పకొండపై వెలసిన శ్రీ రస సిద్ధేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథానికి గుర్రాలను పంపే ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 22, 2026 / 08:00 AM IST

రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించిన FMT

VZM: రామభద్రపురం మండలం అరికతోటలో శనివారం నేషనల్‌ మిషన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ FMT (Farmer Master Trainer) లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి సేద్యంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఈ గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏయే పంటలు సాగుచేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

March 22, 2026 / 08:00 AM IST

పాము కాటు.. గీత కార్మికుడు మృతి

సత్యసాయి: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య 60 శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో కళ్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్న సమయంలో రక్తపింజరి పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు అతన్ని పొదలకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.

March 22, 2026 / 08:00 AM IST

నకిలీ ఫోన్ పే తో మోసం.. రంగంలోకి పోలీసులు

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో డిజిటల్ చెల్లింపుల పేరిట మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెడికల్ షాపులో రూ.400 విలువైన మందులు కొనుగోలు చేసిన సదరు వ్యక్తి, ఫోన్ పే ద్వారా నగదు పంపినట్లు నకిలీ స్క్రీన్ షాట్ చూపించాడు. అయితే యజమాని కుమార్ ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

March 22, 2026 / 08:00 AM IST