NGKL: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లోని LIC ఆఫీస్ పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సినీ గాయకులు లాస్య ప్రియ, సంపత్, శిరీష తదితరులు సందడి చేశారు. శుక్రవారం కళాశాల వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇందులో భాగంగా ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ డీ.రమణారెడ్డి, ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.
SRD: చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూను ఉప కులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్డీవో పాండు చేతుల మీదుగా జయంతికి సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ నరసింహ, ఫార్మసీ ప్రిన్సిపల్ సునీత రెడ్డి పాల్గొన్నారు.
NLG: కట్టంగూర్ మండలం ఈదులూరు వాసి గద్దపాటి నరసింహను కుల సంఘానికి తన భూమి ఇవ్వలేదని 3 ఏళ్ల క్రితం కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. నరసింహ ఇంటికి ఎవరూ వెళ్లొద్దని, అతడు కూడా ఎవరింటికీ రావద్దని తీర్మానించారు. అప్పటి నుంచి నరసింహ మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల ఓ కార్యానికి నరసింహ రాగా కులపెద్దలు వెళ్లిపోమ్మన్నారు. శుక్రవారం బాధితుడు పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
SRD: ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో యువ వికాసం సహాయ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
AP: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాకాణికి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సోమవారం ప్రాసిక్యూషన్ వాదనల తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.
అన్నమయ్య: పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ ఎంతో ప్రసిద్ధి చెందిందని గ్రూప్ కెప్టెన్ ఆర్జే ఆత్రే కమాండింగ్ ఆఫీసర్ అన్నారు. శుక్రవారం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్సీసీ వింగ్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నత చదువులకు ఎన్సీసీ ధృవపత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
BHPL: ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను తీసుకురావాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం పలు మండల ప్రత్యేక అధికారులతో ఐడీవోసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
NLG: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం నెలకొందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సమీక్షలు లేవు, కొనుగోలు కేంద్రాలపై మాట్లాడడం లేదన్నారు.
MBNR: జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం మంజూరు అయింది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇది ప్రారంభంకానుంది. ఇందులో నాణ్యమైన మందులు తక్కువ ధరలకు లభించనున్నాయి. దీంతో పేద ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి.
BPT: కర్లపాలెం మండలం ఎంవీ రాజుపాలెం గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: చందంపేట మండలం పోలేపల్లి వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. ఈనెల 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
KKD: రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి కళా వీధి ప్రదర్శనలో సీఎం నారా చంద్రబాబు స్వయంగా చిత్రీకరించిన బుద్ధుడి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్ర పటానికి ఉప సభాపతి కె. రఘు రామకృష్ణంరాజు రూ. 1,01,116లు చెల్లించి శుక్రవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చిత్రీకరించిన బుద్ధుడిని తాను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు మేరకు పదోన్నతి లభించడంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు… రమణారెడ్డిని రావులపాలెం అదనపు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రమణారెడ్డి రావులపాలెం అదనపు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలో శుక్రవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొని రూ.1.5 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.