సత్యసాయి: లేపాక్షి మండలం కొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణి అండర్-17 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రాణించి రెండో స్థానం దక్కించుకుంది. ఈనెల 7 నుంచి 9 వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఉపాధ్యాయులు తెలిపారు.
RR: మన్సురాబాద్ చిన్నచెరువుకు ప్రత్యామ్నాయంగా నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ పురోగతిని కార్పొరేటర్ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 కాలనీలకు నీటి నిల్వలు, వరద సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
అన్నమయ్య: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేశారని నిస్సార్ అహ్మద్ అన్నారు. ఇవాళ మదనపల్లె మండలం, కొత్త ఇండ్లు గ్రామపంచాయతీలో వైసీపీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం నిస్సార్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
SRD: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం దారుణమని చెప్పారు.
AP: దుబాయ్లో రెండోరోజు మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు అపారెల్ గ్రూప్ ఛైర్మన్ నీలేష్ వేద్తో ఆయన భేటీ అయ్యారు. ఫ్యాషన్, ఫుట్వేర్ రంగాల్లో 14 దేశాల్లో అపారెల్ గ్రూప్ ప్రసిద్ధి చెందింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆ గ్రూప్ను ఆహ్వానించారు. అలాగే, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్తో భేటీ అయ్యారు.
TPT: తిరుపతి నగరంలోని గరుడ వారధి ఫ్లైఓవర్ పై ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన ఫ్లైఓవర్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ… యువత వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
SKLM: రైతుల పక్షాన నిలిచి పక్కాగా నివేదికలు రూపొందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని, కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
PLD: సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.57,03,788 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆర్థిక స్తోమత లేనివారి చికిత్సకు ఈ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
E.G: పెరవలి గ్రామంలోని రైతు బజార్ షెడ్స్ సమీపంలో కానూరు నుంచి నరసాపురం వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 55 ఏళ్ల వయసు ఉంటుందని ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440696642 నంబర్లో సంప్రదించాలని కోరారు.
E.G: పెరవలి గ్రామంలోని రైతు బజార్ షెడ్స్ సమీపంలో కానూరు నుంచి నరసాపురం వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 55 ఏళ్ల వయసు ఉంటుందని ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440696642 నంబర్లో సంప్రదించాలని కోరారు.
TPT: పుత్తూరు మండలం తడుకు పంచాయతీ VSS పురంలోని వెంకటేశ్ ఇంట్లో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి ఇల్లు మొత్తం కాలిపోయింది. సమాచారం అందిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. తక్షణ సహాయం అందిస్తూ, కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న హౌసింగ్ స్కీం కింద కొత్త ఇల్లు మంజూరు చేయాలని అధికారులు ఆదేశించారు.
PPM: డోలీ మోతలు ఉండకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరీ అన్నారు. మంగళవారం కొమరాడ మండల టీడీపీ కన్వీనర్ శేఖర్ పాత్రుడు ఆధ్వర్యంలో మసిమండ, పెదశాఖ గ్రామ పంచాయతీలలో గిరిశిఖర గ్రామాల రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
W.G: కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు కేంద్రంలోని మోదీ సర్కార్ చట్టాలు చేస్తున్నదని విశాఖ అకాడమీ ఛైర్మన్ వి.వి రమణమూర్తి విమర్శించారు. ఇవాళ ఏలూరు మర్చంట్ చాంబర్స్ కళ్యాణ మండపంలో రాష్ట్ర రాజకీయ తరగతులు నిర్వహించారు. రోజుకు 12 గంటలు పనిని ప్రవేశపెట్టి మానవతా కోణం లేకుండా శ్రామికులను యంత్రాలుగా పని చేయించేందుకు చట్టాలు మారుస్తున్నారని అన్నారు.