PKSM: చీమకుర్తిలో శ్రీ భావన ఋషిస్వామి దేవస్థానంలో రామతీర్థం గంగమ్మ తల్లి తిరుణాల సందర్భంగా పద్మశాలి అన్న సత్రం కరపత్రాలను ఆవిష్కరించారు. మొదట కరపత్రాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పట్టణ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
KRNL: ఆన్లైన్ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలవీరాంజనేయులు అనే వ్యక్తిని ఫైయర్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయమైన నేరగాళ్లు షేర్ ట్రేడింగ్లో లాభాల మాయతో నమ్మబలికారు. తొలుత లాభాలు చూపించి విశ్వాసం కల్పించి, అనంతరం రూ.14.04 లక్షలు తమ ఖాతాలకు జమ చేయించారు.
SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లన్న క్షేత్రం నుంచి నేరుగా ఇక్కడికి భక్తులు వస్తుండటంతో తీగుల్ నర్సాపూర్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో దర్శనానికి సమయం పడుతుంది అని అన్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ.300 కోట్లకు పైగా ఉందట. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఆమె.. సొంత ప్రొడక్షన్ హౌస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోనూ భారీగా సంపాదిస్తున్నట్లు టాక్. చెన్నై, HYD, ముంబైల్లో ఖరీదైన ఇళ్లతో పాటు రూ.50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉందని సమాచారం.
WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జల జీవన్ మిషన్ జల మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జల సంరక్షణ, తాగునీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
TPT: సూళ్లూరుపేట మండలం కే.సీ.యన్ గుంటకు చెందిన తుమ్మ వెంకటరమణయ్య మరణించగా, ఆయనకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యాక్టివ్గా ఉండటంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. కెనరా బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసి రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని ఆయన భార్య సుప్రియకు అందజేశారు. తిరుపతి సర్కిల్ అధికారుల చేతుల మీదుగా ఈ చెక్కు అందించారు.
ATP: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విమర్శించారు. సింగనమల నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ. 40 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలగూడెం, ఇందిరమ్మ కాలనీలో ఇవాళ తెల్లవారు జామున ట్రైనీ ఐపీఎస్ జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోకి వచ్చే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్ను బుక్ చేశారని సమాచారం. తుది నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది.
GDWL: గట్టు మండలం గొర్లఖార్దొడ్డి సమీపంలోని భరత్మాల జాతీయ రహదారిపై ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి దేవరపోతును బలంగా ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామానికి రక్షణగా భావించే దేవరపోతు మృతితో స్థానికులు ధర్నా చేపట్టారు.
NDL: చాగలమర్రి మండలం రాంపల్లి-నేలంపాడు మధ్య ఇవాళ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహబూబ్ బాషా (28) తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి కాలు, కుడి చేతి వేళ్లు విరిగాయి. స్థానికులు 108 ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు జంగాలపల్లి నుంచి చాగలమర్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
NLG: కట్టంగూరు మండలంలో పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ‘గాలికుంటు వ్యాధి’ టీకాలు అక్రమార్కులకు కాసుల వేటగా మారాయి. పేద రైతుల కోసం ఉచితంగా అందాల్సిన టీకాలు దారి మళ్లి, ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టీకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయనేది మిస్టరీగా మారింది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
SKLM: హిర మండలానికి చెందిన ఓ మహిళను పోలాకి M అంబెరు పేటకు చెందిన దుర్గారావు ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుర్గారావుపై అట్రాసిటి కేసు నమోదు చేసి టెక్కలి డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. దుర్గారావును అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరచగా..14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు.
KMM: బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జి వద్ద యన్నం వెంకట్రామిరెడ్డి ఆత్మహత్య ఘటన ఉత్కంఠ రేపుతోంది. మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభ్యమైందని కుటుంబ సభ్యులు వెల్లడించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ఆసుపత్రికి తరలించారు.
PLD: నరసరావుపేటలో గ్యాస్ కొరత తీవ్రమైందని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నడిపే చిన్న చిన్న హోటళ్లు మూతపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 1000 ఉండాల్సిన సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.3,500లకు చేరుకుందని ఆయన విమర్శించారు. గ్యాస్ సరఫరా విషయంలో సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.