E.G: పెరవలి గ్రామంలోని రైతు బజార్ షెడ్స్ సమీపంలో కానూరు నుంచి నరసాపురం వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 55 ఏళ్ల వయసు ఉంటుందని ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440696642 నంబర్లో సంప్రదించాలని కోరారు.