KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా అదిలాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరేట్లో గురువారం సమర్పించారు. తాను 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రెబల్గా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
GNTR: ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని అంగన్వాడీ టీచర్లను కోరారు.
PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన జాపతి రాజయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నేత్రదానం చేశారు. లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోహైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు దేవక్క, శ్రీనివాస్, శేఖర్, రమ, పాల్గొన్నారు.
SRCL: కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో గల కళాశాల మైదానం బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియం వాకర్స్తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
GNTR: అమరావతిలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై జరిగిన నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై ముఖ్య నాయకులకు మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు.
PDPL: తప్పుడు అఫిడవిట్లతో పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తమపై ఎలాంటి కేసులు లేవంటూ దరఖాస్తు చేసుకున్న విజయ్, రాజేశ్ కుమార్లపై ఎస్బీ అధికారులు వెరిఫికేషన్ చేసి క్రిమినల్ కేసులు ఉన్నట్లు నిర్ధారించామన్నారు.
SRCL: చందుర్తి మండల బీసీ సాధికారిత సంఘం మండల అధ్యక్షులుగా ముద్ర కోల వెంకన్న నియామకమయ్యారు. ఈ మేరకు వేములవాడలో గురువారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్లు వెంకన్నకు నియామక పత్రం అందజేశారు. బీసీల హక్కుల కోసం పోరాడనున్నట్టు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకన్నకు అభినందనలు తెలిపారు.
TPT: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకీ ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రిన్సిపల్ రమణకు ఆగంతకులు మెయిల్ చేశారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో డిస్పోజబుల్ టీం, పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా నరసన్నపేట మండలంలో 1352 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ టి. సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 105 రోజుల్లో వీటిని పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికి 30 రోజులు పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు.
NTR: నందిగామలోని ఓ పత్రికా విలేఖరి వెలది సుగుణశేఖర్ రావుని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గురువారం పరామర్శించారు. గుండెపోటు కారణంగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.
కృష్ణా: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విద్యార్థులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహాయపడాలని అనే అంశాలను ప్రదర్శన రూపంలో ప్రజలకు తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనకు ప్రజలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా ‘ఛావా’. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో డైరెక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలోని కీలక సీన్ షూటింగ్ సమయంలో విక్కీ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దాదాపు నెలన్నర బ్రేక్ తీసుకున్నారని వెల్లడించారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల కోత విషయంలో ట్రంప్ నిర్ణయం ఫలిస్తోంది. స్వచ్ఛంద రాజీనామాకు 40 వేల మందికిపైగా ఉద్యోగులు ఆమోదం తెలిపారని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ గడువు ఇవాళ్టి వరకు మాత్రమే ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP: కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. అమలు చేయకపోతే చొక్కాలు పట్టుకుని నిలదీయండని అన్నారు. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీగా మారింది. బటన్ నొక్కటం గొప్పనా అని మాపై విమర్శలు చేశారు. ఈ 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి’ అని అన్నారు.