KMM: సత్తుపల్లి పట్టణం ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఈద్గాలో మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు అన్ని విధాల తోడుగా ఉంటుందని ఆయన తెలిపారు. ముస్లిం ప్రజానీకం ప్రజా ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వాలని కోరారు.