AKP: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శనివారం సబ్బవరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు.