• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి: నటి

సినీ ఇండస్ట్రీలో దర్శకులకు జరుగుతున్న అన్యాయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మన ఇండస్ట్రీలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడి సూపర్ స్టార్లు దర్శకులను వేధిస్తారు. అందుకే కొత్తగా వచ్చే యువత కేవలం నటులు కావాలని అనుకుంటున్నారే తప్ప, డైరెక్టర్లు లేదా సినిమాటోగ్రాఫర్లు కావాలని కలలు కనడం లేదు’ అని పేర్కొంది.

March 21, 2026 / 08:59 PM IST

పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్

HYD: డాక్టర్ B.R అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1986 నుంచి 2013 వరకు డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) పూర్తి చేయలేకపోయిన పాత బ్యాచ్ విద్యార్థులకు మరోసారి అడ్మిషన్ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. నిర్దిష్ట నిబంధనలతో తిరిగి నమోదు చేసుకుని మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.

March 21, 2026 / 08:54 PM IST

బడ్జెట్ ప్రతులను తగులబెట్టిన ఏబీవీపీ నేతలు

KNR: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతులను దహనం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన రూ.3,24,234 కోట్ల పద్దులో విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. విద్యారంగానికి పట్టుమని 15% కూడా నిధులు కేటాయించలేదన్నారు.

March 21, 2026 / 08:52 PM IST

MRO కుటుంబానికి MP గోడం నగేశ్ పరామర్శ

ADB: నేరడిగోండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన సత్నాల తహశీల్దార్ జాదవ్ రామారావు తండ్రి జాదవ్ నిమ్య నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా MRO కుటుంబాన్ని ఆదిలాబాద్ MP నగేశ్ శనివారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

March 21, 2026 / 08:50 PM IST

తాళ్లపూడిలో ఈ నెల 23న జాబ్ మేళా

E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. APSSDC సహకారంతో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

March 21, 2026 / 08:49 PM IST

ఈ ప్రాంతాల్లో రేపు పవర్ కట్

BDK: భద్రాచలం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు శనివారం తెలిపారు. ఐటీడీఏ రోడ్డు, మెడికల్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, సుందరయ్య నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో పవర్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహాకరించాలన్నారు.

March 21, 2026 / 08:49 PM IST

‘బండలాగుడు పోటీ విజేతలకు బహుమతులు’

NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో సుంకుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి పాల పండ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కోడుమూరు వృషభాలు ప్రథమ, ప్రకాశం జిల్లా ద్వితీయ, సీసంగుంటల తృతీయ, మంత్రాలయం-బేతంచెర్ల నాల్గవ, మాధవరం ఐదవ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు రూ.40 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు అందజేశారు.

March 21, 2026 / 08:49 PM IST

పోలాకిలో ఇంటింటి ప్రచారం

SKLM: పోలాకి మండల కేంద్రంలో నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన శనివారం రాత్రి పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లిలో మార్చి 23న జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

March 21, 2026 / 08:49 PM IST

జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు

NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సై రాజేష్ వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, ఫైన్‌లు విధించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.

March 21, 2026 / 08:49 PM IST

‘సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రణాళిక బద్ధమైన చర్యలు చేపట్టాలి’

PDPL: సింగరేణి సంస్థ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికా బద్ధమైన చర్యలు చేపట్టాలని BMS నాయకులు కోరారు. సంస్థ CMDగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతిని HYD సింగరేణి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి దృష్ట్యా కొత్త బొగ్గు గనులను వేలంపాట ద్వారా సాధించాలన్నారు. సంస్థకు రావలసిన రూ. 50 వేల కోట్ల బకాయిలను వసూలు చేయాలన్నారు.

March 21, 2026 / 08:46 PM IST

హనుమంతరాయ చౌదరికి మంత్రి సవిత నివాళి

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామానికి వెళ్లి హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

March 21, 2026 / 08:46 PM IST

‘ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలి’

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ BRTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సంఘ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం వెంటనే స్పందించి హామీ మేరకు వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

March 21, 2026 / 08:45 PM IST

వేలాది మహిళలతో అమ్మవారికి హారతులు

W.G: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారికి వేలాది మంది మహిళలతో మంగళ హారతులు ఇచ్చి ఇవాళ రాత్రి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వెయ్యి మంది కళాకారులతో ఈ ఆఖరి రోజు ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖులు, రాజకీయ నేతలు అమ్మవారి రధాని లాగుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 21, 2026 / 08:45 PM IST

ఈనెల 23న చలో విజయవాడ

ELR: ఈనెల 23న జరుగుతున్న చలో విజయవాడ ప్రదర్శన, మహా ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఐఎన్టీయూ ఏలూరు నగర అధ్యక్షులు బి.సోమయ్య పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉన్నాయన్నారు.

March 21, 2026 / 08:45 PM IST

రంజాన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి

CTR: నగరి మున్సిపాలిటీ పుదుపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలుపుతూ.. రంజాన్ నెలలో పాటించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనిషిలో సహనం, దాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

March 21, 2026 / 08:44 PM IST