• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

CTR: తవణంపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. వెంగంపల్లి, గోవిందరెడ్డి పల్లె, ఏ గొల్లపల్లె గ్రామాలలో నూతన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఏ గొల్లపల్లిలో స్మశాన వాటిక ప్రహరీని ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

March 21, 2026 / 06:29 PM IST

బీజేపీ కార్యాలయంలో SIR సన్నాహక సమావేశం

అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు రాజేష్ కురుబ అధ్యక్షతన SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు సందిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులకు రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

March 21, 2026 / 06:28 PM IST

రాయచోటిలో ఆర్యవైశ్య మహిళలకు వడి బియ్యం పంపిణీ

అన్నమయ్య: రాయచోటి వాసవి క్లబ్ వనితల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, 111 మంది ముత్తయిదువులకు వడి బియ్యం అందజేశారు. ముందుగా అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అనంతరం మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షురాలు మాధవి లత, ప్రస్తుత అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఈ సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు.

March 21, 2026 / 06:27 PM IST

పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పూజలు

BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో దేవి వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం మూడో రోజు దేవి నవరాత్రుల్లో ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మల్లెపూలతో లక్ష కుసుమార్చిన పూజలు చేశారు. తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజ, శ్రీ చక్రార్చన, సూర్య నమస్కారములు, మూలమంత్ర అను స్తానం పూజలు చేశారు.

March 21, 2026 / 06:25 PM IST

ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు

VZM: పశ్చిమాసియాలో యుద్ధం సమసిపోయి, ప్రపంచంలో శాంతి నెలకొనాలని అంకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 30 రోజులు పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు శనివారం నెలవంక ఉషోదయంతో దీక్షను విరమించి రంజాన్ పండగను ఘనంగా జరుపుకొన్నారు. RTC కాంప్లెక్స్ సమీపంలో గల అతి పెద్ద ఈద్గాల్లో అందరూ కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.

March 21, 2026 / 06:23 PM IST

‘సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా’

SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

March 21, 2026 / 06:22 PM IST

గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలి: CI ప్రసాద్

ADB: గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నార్నూర్ ఇన్‌ఛార్జ్ CI ప్రసాద్ శనివారం తెలిపారు. మాలేపూర్ గ్రామానికి చెందిన నిందితుడు బాలాజీ తన వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడు నుంచి దాదాపు రూ.2.4 లక్షలు విలువైన 24 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 06:21 PM IST

’20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం’

E.G: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా పరిష్కరించి యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. శనివారం రాజానగరంలో ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

March 21, 2026 / 06:21 PM IST

రేపు కోదాడకు రానున్న మంద కృష్ణ మాదిగ

SRPT: లాకప్ డెత్ బాధితుడు కర్ల రాజేష్ కేసు అంశాలపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రేపు కోదాడకు రానున్నారు. ఫిబ్రవరి 27న రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించగా, కేసు దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ రవిని కలవనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంద కృష్ణ పాల్గొంటారని జిల్లా నాయకుడు రాజు వెల్లడించారు.

March 21, 2026 / 06:20 PM IST

ఫ్లోరింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

WGL: 19వ డివిజన్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో రూ.29.70 లక్షల వ్యయంతో బి.టి ఫ్లోరింగ్ నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి..తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంలో ఆమె వెంట మేయర్ సుధారాణి ఉన్నారు.

March 21, 2026 / 06:20 PM IST

గండి క్షేత్రంలో అవినీతి ఆరోపణలు

KDP: గండి క్షేత్రం అర్చకులపై మాజీ ఛైర్మన్ రాజారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బుల కోసం నైవేద్యం పెట్టకుండా అపచారం చేస్తున్నారని, క్షేత్రంలో అవినీతి తాండవం ఆడుతోందని విమర్శించారు. పూలమాలలు తిరిగి విక్రయించడం, తాయతులు అమ్మకం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్చకుల ఆస్తులపై విచారణ జరిపించాలని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

March 21, 2026 / 06:18 PM IST

విద్యార్థులు రూపొందించిన మ్యాగజైన్ ఆవిష్కరణ

NZB: డొంకేశ్వర్ మండల కేంద్రంలోని PM SHRI ZPHS విద్యార్థులు తయారు చేసిన హిందీ మ్యాగజైన్‌ను హెఎం సురేశ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, క్రీడారంగం, సినిమా రంగం, పిల్లలకు ఇష్టమైన పద వినోదం, విద్యార్థుల సృజనాత్మకతో హిందీ భాషలో కథలు, ఎన్నో అంశాలను తీసుకుని సుందరంగా తయారు చేసినట్లు చెప్పారు.

March 21, 2026 / 06:18 PM IST

సినిమాటోగ్రఫీ మంత్రిని దూరం పెట్టారా..?

TG: తెలుగు ఇండస్ట్రీకి.. సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు మంత్రి అనుమతి లేకుండానే నిర్ణయాలు జరుగుతుండగా.. ఇటీవల జరిగిన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సినిమాటోగ్రఫీ శాఖలో కోమటిరెడ్డి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

March 21, 2026 / 06:16 PM IST

‘ప్రతి గ్రామంలో పండగ చేసుకోవాలి’

AKP: నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్‌కు ఈనెల 23న శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పండగ చేసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కూటమి ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేందుకు 50 బస్సులు కేటాయించినట్లు తెలిపారు.

March 21, 2026 / 06:14 PM IST

‘గరికపాటి క్షమాపణ చెప్పాలి’

VSP: గరికపాటి నరసింహారావు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని AISF డిమాండ్ చేసింది. శనివారం జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ పథకం వల్ల పేద విద్యార్థుల ఆకలి తీరి చదువుకు దోహదం అవుతుందని తెలిపారు. అలాగే, గుడ్డు ద్వారా పోషకాహారం లభిస్తుందని చెప్పారు.

March 21, 2026 / 06:14 PM IST